Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Telugu Devotional / Spirutual Articles. Show all posts
Showing posts with label Telugu Devotional / Spirutual Articles. Show all posts
Saturday, 16 September 2023
Monday, 25 February 2019
THIDULU - DEVATHALA PERLU
తిధులు - ఆయా దేవతల పేర్లు
1. పాడ్యమి - #గౌరీ_దేవత (గౌరీ వ్రతం)
2. విదియ - #అశ్వని_దేవతలు
3. తదియ - #పరశురాముడు (అట్లతద్ది)
4. చవితి - #వినాయకుడు (వినాయక చవితి)
5. పంచమి - #సర్పదేవతలు (నాగ పంచమి)
6. షష్ఠి - #సుబ్రమణ్యస్వామి (సుబ్రమణ్యషష్ఠి)
7. సప్తమి - #సూర్యుడు (రధ సప్తమి)
8. అష్టమి - #శ్రీ_కృష్ణుడు (కృష్ణాష్టమి)
9. నవమి - #శ్రీ_రాముడు (శ్రీ రామనవమి)
10. దశమి - #దుర్గాదేవి (విజయదశమి)
11. ఏకాదశి - #విష్ణవు, (తొలిఏకాదశి)
12. ద్వాదశి - #కూర్మావతారం (క్షేరాబ్ధి ద్వాదశి)
13. త్రయోదశి - #శివుడు, #శనీశ్వరుడు (శని త్రయోదశి)
14. చతుర్థి - #నృసింహస్వామి (నరక చతుర్థి)
15. పూర్ణిమ - #సద్గురువులు, #గురువులు (గురు పూర్ణిమ)
15. అమావాస్య - #లక్ష్మీదేవి (దీపావళి అమావాస్య) Soma Sekhar
1. పాడ్యమి - #గౌరీ_దేవత (గౌరీ వ్రతం)
2. విదియ - #అశ్వని_దేవతలు
3. తదియ - #పరశురాముడు (అట్లతద్ది)
4. చవితి - #వినాయకుడు (వినాయక చవితి)
5. పంచమి - #సర్పదేవతలు (నాగ పంచమి)
6. షష్ఠి - #సుబ్రమణ్యస్వామి (సుబ్రమణ్యషష్ఠి)
7. సప్తమి - #సూర్యుడు (రధ సప్తమి)
8. అష్టమి - #శ్రీ_కృష్ణుడు (కృష్ణాష్టమి)
9. నవమి - #శ్రీ_రాముడు (శ్రీ రామనవమి)
10. దశమి - #దుర్గాదేవి (విజయదశమి)
11. ఏకాదశి - #విష్ణవు, (తొలిఏకాదశి)
12. ద్వాదశి - #కూర్మావతారం (క్షేరాబ్ధి ద్వాదశి)
13. త్రయోదశి - #శివుడు, #శనీశ్వరుడు (శని త్రయోదశి)
14. చతుర్థి - #నృసింహస్వామి (నరక చతుర్థి)
15. పూర్ణిమ - #సద్గురువులు, #గురువులు (గురు పూర్ణిమ)
15. అమావాస్య - #లక్ష్మీదేవి (దీపావళి అమావాస్య) Soma Sekhar
Tuesday, 31 October 2017
Monday, 16 October 2017
Saturday, 7 October 2017
TELUGU PURANA ARTICLE - PANCHA MAHA YAGNALU BY SRI SOMA SEKHAR
పంచ మహా యజ్ఞాలు
ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషీ తన జీవితములో అనునిత్యం పాటించవలసిన కొన్ని విధులు ఉన్నాయి. అవే పంచ మహాయజ్ఞాలు.
1. దేవ యజ్ఞం – సకల ప్రాణికోటిలో ఉత్తమమైన జన్మను పొందిన మనము సృష్టికి మూలకారకుడైన ఆ పరమేశ్వరుడికి కృతఙ్ఞతలు తెలపడమే దేవయజ్ఞం. పూర్వం ప్రతి ఇంట్లోనూ నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. వారు తమ భోజనానికి ముందు కొంత అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనినే అహుతం అంటారు. దేవతలు అగ్నిముఖంగా ఆహారాన్ని స్వీకరిస్తారు. కనీసం ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా అహుతం చేసినట్లే.
2. పితృ యజ్ఞం – మనల్ని కన్న తల్లిని, పెంచి పెద్ద చేసిన తండ్రిని ప్రేమగా చూడాలి. వారు మన చిన్నతనములో మనల్ని ఎంత ప్రేమగా చూసేవారో, మనం కూడా వారి పెద్ద వయసులో వారి అవసరాలు చూస్తూ కనిపెట్టుకుని ఉండాలి. ఈ విధముగా చేస్తే వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలము.
3. భూత యజ్ఞం – గృహస్థాశ్రమములో ఉన్న వ్యక్తి సర్వ ప్రాణికోటి మీద దయను కలిగి ఉండాలి. మనం అన్నం తినడానికి ముందు ఒక ముద్ద అన్నాన్ని పక్షులు వచ్చే ప్రదేశములో పెట్టాలి. ఇంటి ముందు కాపలాగా ఉండే కుక్కకు, ఇంట్లో తిరిగే పిల్లికి, దొడ్లో ఉండే పశువులకు ఆహారాన్ని పెట్టాలి. అలాగే క్రిమి కీటకాదులకు కొంత ఆహారాన్ని పెట్టాలి. ఈ విధముగా సకల ప్రాణులందు దయ కలిగి, వాటికి ఆహారం అందివ్వడమే భూత యజ్ఞం.
4. మనుష్య యజ్ఞం – తిథి, వారము చూసుకోకుండా వచ్చేవాడే అతిథి. మన పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథి దైవముతో సమానం. కనుక ఎవరైనా మన ఇంటికి వచ్చినపుడు ఆ సమయాన్ని బట్టి వారిని తగిన విధముగా గౌరవించాలి. ఎవరైనా మన సహాయాన్ని అర్ధించినప్పుడు మనం చెయ్యగలిగిన సహాయాన్ని స్వార్థ రహితంగా చెయ్యాలి.
5. బ్రహ్మ యజ్ఞం – పూర్వపు రోజులలో ప్రతివారు వేదాన్ని చదివేవారు. ఇప్పుడు వేదమంత్రాలను పఠించేవారి సంఖ్య తగ్గిపోయింది. మనం వేదాలను చదువలేకపోతే కనీసం మనకు అందుబాటులో ఉన్న శాస్త్రాలను అయినా చదవాలి. అలాగే వాటి ద్వారా మనము తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవాలి. దీని వలన జ్ఞానం పెరుగుతుంది.
ఈ ఐదు యజ్ఞాలను ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటే అందరూ సక్రమ మార్గములో నడుస్తారు. దానివలన ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషీ తన జీవితములో అనునిత్యం పాటించవలసిన కొన్ని విధులు ఉన్నాయి. అవే పంచ మహాయజ్ఞాలు.
1. దేవ యజ్ఞం – సకల ప్రాణికోటిలో ఉత్తమమైన జన్మను పొందిన మనము సృష్టికి మూలకారకుడైన ఆ పరమేశ్వరుడికి కృతఙ్ఞతలు తెలపడమే దేవయజ్ఞం. పూర్వం ప్రతి ఇంట్లోనూ నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. వారు తమ భోజనానికి ముందు కొంత అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనినే అహుతం అంటారు. దేవతలు అగ్నిముఖంగా ఆహారాన్ని స్వీకరిస్తారు. కనీసం ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా అహుతం చేసినట్లే.
2. పితృ యజ్ఞం – మనల్ని కన్న తల్లిని, పెంచి పెద్ద చేసిన తండ్రిని ప్రేమగా చూడాలి. వారు మన చిన్నతనములో మనల్ని ఎంత ప్రేమగా చూసేవారో, మనం కూడా వారి పెద్ద వయసులో వారి అవసరాలు చూస్తూ కనిపెట్టుకుని ఉండాలి. ఈ విధముగా చేస్తే వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలము.
3. భూత యజ్ఞం – గృహస్థాశ్రమములో ఉన్న వ్యక్తి సర్వ ప్రాణికోటి మీద దయను కలిగి ఉండాలి. మనం అన్నం తినడానికి ముందు ఒక ముద్ద అన్నాన్ని పక్షులు వచ్చే ప్రదేశములో పెట్టాలి. ఇంటి ముందు కాపలాగా ఉండే కుక్కకు, ఇంట్లో తిరిగే పిల్లికి, దొడ్లో ఉండే పశువులకు ఆహారాన్ని పెట్టాలి. అలాగే క్రిమి కీటకాదులకు కొంత ఆహారాన్ని పెట్టాలి. ఈ విధముగా సకల ప్రాణులందు దయ కలిగి, వాటికి ఆహారం అందివ్వడమే భూత యజ్ఞం.
4. మనుష్య యజ్ఞం – తిథి, వారము చూసుకోకుండా వచ్చేవాడే అతిథి. మన పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథి దైవముతో సమానం. కనుక ఎవరైనా మన ఇంటికి వచ్చినపుడు ఆ సమయాన్ని బట్టి వారిని తగిన విధముగా గౌరవించాలి. ఎవరైనా మన సహాయాన్ని అర్ధించినప్పుడు మనం చెయ్యగలిగిన సహాయాన్ని స్వార్థ రహితంగా చెయ్యాలి.
5. బ్రహ్మ యజ్ఞం – పూర్వపు రోజులలో ప్రతివారు వేదాన్ని చదివేవారు. ఇప్పుడు వేదమంత్రాలను పఠించేవారి సంఖ్య తగ్గిపోయింది. మనం వేదాలను చదువలేకపోతే కనీసం మనకు అందుబాటులో ఉన్న శాస్త్రాలను అయినా చదవాలి. అలాగే వాటి ద్వారా మనము తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవాలి. దీని వలన జ్ఞానం పెరుగుతుంది.
ఈ ఐదు యజ్ఞాలను ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటే అందరూ సక్రమ మార్గములో నడుస్తారు. దానివలన ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
Saturday, 16 September 2017
Wednesday, 28 June 2017
FIND A PERSON THROUGH PRASNA SASTRAM - PRASNA CHAKRAM
ప్రశ్న శాస్త్రం ద్వారా తప్పిపోయిన వాళ్ళను కనుక్కోవటం
ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.
ప్రశ్న అడిగినవారు వారి తాలూకు బంధువులు లేదా సన్నిహితులు అయి ఉండి వారు ఊరు ప్రయాణమై వెళ్లి వారి జాడ తెలియని సందర్భంలో.. తత్కాల ప్రశ్న లగ్నం ఆధారంగా చెప్పవచ్చు.సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, చాలాకాలం సందేశాలు రానప్పుడు ‘వెళ్లినవారు ఏమయినారో’ అనే విషయంగా ప్రశ్న అడుగుతుంటారు.
లగ్నానికి సంబంధంగా ఉన్న షడ్వర్గులు హోర, ద్రేక్కాణ, సప్తాంశ, ద్వాదశాంశ, నవాంశ, త్రిశాంశలు నిర్ధారణ జరపాలి. ప్రశ్న అడిగిన లగ్నం స్దిర రాశులైన వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశులలో ఒకటి అయి షడ్వర్గులు కూడా అధికంగా స్థిర వర్గులు వస్తే అప్పుడు ఆ వ్యక్తి వెళ్లిన చోట స్థిరముగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఎటువంటి సమస్యా లేదని కూడా చెప్పచ్చు.
చర రాశులైన మేష, కర్కాటక, తుల, మకరములలో ఒకటి లగ్నము అయి ఎక్కువ షడ్వర్గులు చర వర్గులు అయిన యెడల వెళ్లిన మనిషి వెళ్లిన చోట స్థిరముగా లేరు అని చెప్పాలి.తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉండచ్చు.
ద్విస్వభావ రాశులు అయిన మిథున, కన్య, ధను, మీన రాశులలో ప్రశ్న అడిగిన యెడల వెళ్లిన వ్యక్తి యొక్క లక్షణము కూడా చంచల్యము ద్వంద్వముగా వున్నది అని చెప్పవలెను. లగ్నమును పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్రులలో ఎవరు చూచిననూ లేదా లగ్నములో వున్ననూ సంపూర్ణ శుభ ఫలము చెప్పవలెను. అనగా వెళ్లినచోట సుఖముగా వున్నారు. ఇబ్బంది పడటం లేదు అని చెప్పాలి.
లగ్నములో పాపగ్రహములు వున్నను, పాప గ్రహములు లగ్నమును చూచినను వెళ్లిన చోట మనిషి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. స్థిర లగ్నములలో పాప గ్రహములు వున్నవి అనుకోండి మనిషి వెళ్లినచోట స్థిరముగా ఉండి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. అదే రీతిగా శుభగ్రహాలు వున్న చర లగ్నంలో ప్రశ్న అడిగిన యెడల చలనం కోరుకుంటున్నారు. అది మంచి ఫలితమే సూచించనున్నదని చెప్పాలి.
ద్విస్వభావ లగ్నాలకు పాపగ్రహం సంబంధం పాప ఫలితాలను, శుభ గ్రహ సంబంధం శుభ ఫలితాలను సూచిస్తుంది. లగ్నాధిపతితో కలిసి 5 డిగ్రీలలో వేరే ఏదేని గ్రహం ఉన్న యెడల వెళ్లిన వ్యక్తికి తోడుగా వేరేవారు కూడా వున్నారు అని చెప్పచ్చు.
http:// astroexperts.blogspot.in/ 2017/06/blog-post_28.html
ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.
ప్రశ్న అడిగినవారు వారి తాలూకు బంధువులు లేదా సన్నిహితులు అయి ఉండి వారు ఊరు ప్రయాణమై వెళ్లి వారి జాడ తెలియని సందర్భంలో.. తత్కాల ప్రశ్న లగ్నం ఆధారంగా చెప్పవచ్చు.సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, చాలాకాలం సందేశాలు రానప్పుడు ‘వెళ్లినవారు ఏమయినారో’ అనే విషయంగా ప్రశ్న అడుగుతుంటారు.
లగ్నానికి సంబంధంగా ఉన్న షడ్వర్గులు హోర, ద్రేక్కాణ, సప్తాంశ, ద్వాదశాంశ, నవాంశ, త్రిశాంశలు నిర్ధారణ జరపాలి. ప్రశ్న అడిగిన లగ్నం స్దిర రాశులైన వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశులలో ఒకటి అయి షడ్వర్గులు కూడా అధికంగా స్థిర వర్గులు వస్తే అప్పుడు ఆ వ్యక్తి వెళ్లిన చోట స్థిరముగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఎటువంటి సమస్యా లేదని కూడా చెప్పచ్చు.
చర రాశులైన మేష, కర్కాటక, తుల, మకరములలో ఒకటి లగ్నము అయి ఎక్కువ షడ్వర్గులు చర వర్గులు అయిన యెడల వెళ్లిన మనిషి వెళ్లిన చోట స్థిరముగా లేరు అని చెప్పాలి.తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉండచ్చు.
ద్విస్వభావ రాశులు అయిన మిథున, కన్య, ధను, మీన రాశులలో ప్రశ్న అడిగిన యెడల వెళ్లిన వ్యక్తి యొక్క లక్షణము కూడా చంచల్యము ద్వంద్వముగా వున్నది అని చెప్పవలెను. లగ్నమును పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్రులలో ఎవరు చూచిననూ లేదా లగ్నములో వున్ననూ సంపూర్ణ శుభ ఫలము చెప్పవలెను. అనగా వెళ్లినచోట సుఖముగా వున్నారు. ఇబ్బంది పడటం లేదు అని చెప్పాలి.
లగ్నములో పాపగ్రహములు వున్నను, పాప గ్రహములు లగ్నమును చూచినను వెళ్లిన చోట మనిషి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. స్థిర లగ్నములలో పాప గ్రహములు వున్నవి అనుకోండి మనిషి వెళ్లినచోట స్థిరముగా ఉండి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. అదే రీతిగా శుభగ్రహాలు వున్న చర లగ్నంలో ప్రశ్న అడిగిన యెడల చలనం కోరుకుంటున్నారు. అది మంచి ఫలితమే సూచించనున్నదని చెప్పాలి.
ద్విస్వభావ లగ్నాలకు పాపగ్రహం సంబంధం పాప ఫలితాలను, శుభ గ్రహ సంబంధం శుభ ఫలితాలను సూచిస్తుంది. లగ్నాధిపతితో కలిసి 5 డిగ్రీలలో వేరే ఏదేని గ్రహం ఉన్న యెడల వెళ్లిన వ్యక్తికి తోడుగా వేరేవారు కూడా వున్నారు అని చెప్పచ్చు.
http://
ARTICLE IN TELUGU ABOUT - SHATCHAKRAMULU - MANAVA SARIRAMLO SHAT CHAKRAMULU
మానవశరీరంలో షట్చక్రములు
మానవశరీరంలో షట్చక్రములు ఉన్నాయి. అవి
౧. మూలాధారం: ౨. స్వాధిష్ఠానము ౩. మణిపూరము ౪. అనాహతము ౫. విశుద్ధము.
ఇవి మానవశరీరంలో పంచభూత క్షేత్రములు. భ్రూమధ్య స్థానం జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడుతున్నది. ప్రపంచానికంతటికీ వెలుగునిస్తున్నాడు కాబట్టి జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతి అంటే వెలుగు, చైతన్యము. ఈభూమియందు మనకు వెలుగు చైతన్యం ఇచ్చే వాడు సూర్యుడు. ఆసూర్య మండలంలో వెలుగు పరమేశ్వరుడు. ఆదిత్యమండలాంతరవర్తి. ఒక్కొక్క మాసంలో ఒక్కోలా ప్రకాశిస్తున్నాడు.
ఈవిధంగా పన్నెండు రకాలుగా ఉన్న సూర్యుడిని ద్వాదశాదిత్యులు అంటాం. మనకు కనిపించే జ్యోతిర్లింగ స్వరూపమైన సూర్యుడిని ద్వాదశ సంఖ్యలో చెప్తున్నాం కనుక జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునికి కూడా ద్వాదశ సంఖ్య వచ్చింది. పన్నెండులో ప్రళయకాలాలలో కూడా నశించని గొప్ప జ్యోతిర్లింగ క్షేత్రం విశ్వేశ్వర లింగం. భ్రూమధ్య స్థానానికి కాశీ అని పేరు. ఇడ పింగళ నాడులకు మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇడ, పింగళ నాడులు వరణ, అసి అనుకుంటే సుషుమ్న నాడి గంగ. ఈమూడు ఉన్న స్థలం వారణాశి.
సహస్రారం కైలాసం. కం - సుఖం, ఆనందం; కైలాసం అంటే ఆనందం లాస్యం చేసే చోటు. శిరస్సుకు ’కం’ అని పేరు. శిరస్సుపై శివశక్తులు కలిసి లాస్యం చేసే చోటు కైలాసం. సహస్రారమే శివశక్త్యైక్య రూపము, మహాకైలాసనిలయా మృణాళ మృదోర్లతా అని చెప్పబడుతున్నది. సహస్రారం కైలాసం, భ్రూమధ్యం కాశీక్షేత్రం. విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు పంచభూతలింగములు. ఇవి మానవశరీరంలోని శివలింగ క్షేత్రములు. నీలో ఉన్నశివుడిని తెలుసుకుంటే అప్పుడు శివోహం అనే స్థాయికి చేరతాము.
మానవశరీరంలో షట్చక్రములు ఉన్నాయి. అవి
౧. మూలాధారం: ౨. స్వాధిష్ఠానము ౩. మణిపూరము ౪. అనాహతము ౫. విశుద్ధము.
ఇవి మానవశరీరంలో పంచభూత క్షేత్రములు. భ్రూమధ్య స్థానం జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడుతున్నది. ప్రపంచానికంతటికీ వెలుగునిస్తున్నాడు కాబట్టి జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతి అంటే వెలుగు, చైతన్యము. ఈభూమియందు మనకు వెలుగు చైతన్యం ఇచ్చే వాడు సూర్యుడు. ఆసూర్య మండలంలో వెలుగు పరమేశ్వరుడు. ఆదిత్యమండలాంతరవర్తి. ఒక్కొక్క మాసంలో ఒక్కోలా ప్రకాశిస్తున్నాడు.
ఈవిధంగా పన్నెండు రకాలుగా ఉన్న సూర్యుడిని ద్వాదశాదిత్యులు అంటాం. మనకు కనిపించే జ్యోతిర్లింగ స్వరూపమైన సూర్యుడిని ద్వాదశ సంఖ్యలో చెప్తున్నాం కనుక జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునికి కూడా ద్వాదశ సంఖ్య వచ్చింది. పన్నెండులో ప్రళయకాలాలలో కూడా నశించని గొప్ప జ్యోతిర్లింగ క్షేత్రం విశ్వేశ్వర లింగం. భ్రూమధ్య స్థానానికి కాశీ అని పేరు. ఇడ పింగళ నాడులకు మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇడ, పింగళ నాడులు వరణ, అసి అనుకుంటే సుషుమ్న నాడి గంగ. ఈమూడు ఉన్న స్థలం వారణాశి.
సహస్రారం కైలాసం. కం - సుఖం, ఆనందం; కైలాసం అంటే ఆనందం లాస్యం చేసే చోటు. శిరస్సుకు ’కం’ అని పేరు. శిరస్సుపై శివశక్తులు కలిసి లాస్యం చేసే చోటు కైలాసం. సహస్రారమే శివశక్త్యైక్య రూపము, మహాకైలాసనిలయా మృణాళ మృదోర్లతా అని చెప్పబడుతున్నది. సహస్రారం కైలాసం, భ్రూమధ్యం కాశీక్షేత్రం. విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు పంచభూతలింగములు. ఇవి మానవశరీరంలోని శివలింగ క్షేత్రములు. నీలో ఉన్నశివుడిని తెలుసుకుంటే అప్పుడు శివోహం అనే స్థాయికి చేరతాము.
Wednesday, 31 May 2017
Monday, 29 May 2017
Tuesday, 28 February 2017
Friday, 17 February 2017
Wednesday, 1 February 2017
Tuesday, 24 January 2017
Monday, 23 January 2017
MEANING OF CHIDAMBHARA RAHASYAM
చిదంబర రహస్యం అంటే ఏమిటి.
పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.
దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ – శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు. మన తిరుపతికి దగ్గరలో శ్రీ కాళహస్తి ఉంది కదా, అక్కడ ఉండే లింగమే వాయు లింగం. మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే కథ విన్నాం కదా, ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి . ఇక్కడి స్వామి పేరు కాలహస్తీస్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
రెండవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోని జంబూకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జమ్బూకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జమ్బూకేశ్వరుడు అని పేరు వచ్చింది.
మూడవది తేజోలింగం. ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువన్నామలై ) క్షేత్రంలో ఉంది. అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు. ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి . ఇక పృథ్విలింగం సంగతేంటంటే ఇది మట్టిలింగం. ఇది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆఖరిది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబరం అనే క్షేత్రంలో ఉంది. ఈ ఆకాశలింగ దర్శనం చాలా రహస్యమైనది. ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది. అస్సలు లింగ దర్శనమే ఉండదు. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు) మరి అంతటి రహస్యమైన ఈ ఆకాశలింగాన్ని దర్శించాలంటే మనం ఎంతటి తపోనిష్ఠులం అవ్వాలో కదా. ఎంతో సాధన చేయాలి. జీవిత కాలంలో ఒక సారయినా చూడ వలసిన ప్రదేశం చిదంబరం...
చిదంబర క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు
పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.
దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ – శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు. మన తిరుపతికి దగ్గరలో శ్రీ కాళహస్తి ఉంది కదా, అక్కడ ఉండే లింగమే వాయు లింగం. మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే కథ విన్నాం కదా, ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి . ఇక్కడి స్వామి పేరు కాలహస్తీస్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
రెండవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోని జంబూకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జమ్బూకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జమ్బూకేశ్వరుడు అని పేరు వచ్చింది.
మూడవది తేజోలింగం. ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువన్నామలై ) క్షేత్రంలో ఉంది. అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు. ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి . ఇక పృథ్విలింగం సంగతేంటంటే ఇది మట్టిలింగం. ఇది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆఖరిది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబరం అనే క్షేత్రంలో ఉంది. ఈ ఆకాశలింగ దర్శనం చాలా రహస్యమైనది. ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది. అస్సలు లింగ దర్శనమే ఉండదు. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు) మరి అంతటి రహస్యమైన ఈ ఆకాశలింగాన్ని దర్శించాలంటే మనం ఎంతటి తపోనిష్ఠులం అవ్వాలో కదా. ఎంతో సాధన చేయాలి. జీవిత కాలంలో ఒక సారయినా చూడ వలసిన ప్రదేశం చిదంబరం...
చిదంబర క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు
Tuesday, 3 January 2017
BRIEF INFORMATION ABOUT LOPAMUDHRA IN TELUGU
లోక కళ్యాణమే పరమావధిగా జీవించిన మహా తత్వవేత్త!! (లోపాముద్ర)
లోపాముద్ర భారతీయ సాహిత్యంలో ప్రాచీన తత్వవేత్త. ఈమె అగస్త్యమహర్షి భార్య . ఈమె క్రీ.పూ 6వ లేదా 7వ శతాబ్దంలో జీవించినట్లు నమ్మకం. తన భర్తతో పాటు ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. ఈమెకు "కౌశితకి" మరియు "వరప్రద" అనే నామాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదం లో ఒక శ్లోకం ఆమె గురించి తెలియజేస్తుంది. మహా భారతంలో అగత్స్య మహర్షి "గంగద్వార" (హరిద్వార్) వద్ద తన భార్య అయిన లోపాముద్ర సహకారంలో తపస్సు చేసినట్లు ఉన్నది. ఈ దంపతులకు ద్రిధశ్యుడు అనే కుమారుడు ఉన్నాడు, ఆయన ఒక ప్రముఖ కవి. ప్రస్తుతం కావేరి నది లోపాముద్ర పునర్జన్మ పొందిన రూపం అని చెప్పబడుతుంది.
లోపాముద్ర విదర్భ రాజకుమారి. పురాణాల ప్రకారం లోపాముద్ర అగస్త్య మహర్షిచే సృషింపబడినదని, ఆయన వివిధ జంతువులలో అందమైన భాగాలతో(జింక కండ్లు మొదలైనవి) తయారుచేసినట్లు చెప్పబడింది. లోపాముద్ర అనగా వివిధ జంతువులలోని అందమైన భాగాలతో యేర్పడిన మహిళ అని అర్థము. ఆమెను సృష్టించిన తరువాత అగస్త్యుడు ఆమెను రహస్యంగా విదర్భ రాజ భవనానికి తరలించినట్లు చెప్పబడింది.
ఆమె పెరిగి పెద్దయిన తరువాత అగత్స్యుడు ఆమెను వివాహమాడమని కోరాడు. ఒక్కతే కుమార్తె అవడంతో గారాబంగా పెంచిన ఆమెను మునిపత్నిని చేసి అరణ్యాలకు పంపడం ఎలాగా అన్న ఆలోచనలో పడ్డాడు రాజు. బంగారంలాంటి పిల్లను కాపురం కోసం కానలకు పంపలేక తల్లిదండ్రులు సతమతం కావడం చూసిన లోపాముద్ర రుషిపత్నిగా మారడానికి తనకెలాంటి అభ్యంతరమూ లేదని తెలియజేస్తుంది. అగస్త్యుని కోసమే తాను జన్మించానని, రాచపుత్రిక అయినంతమాత్రాన అడవుల్లో కాపురం చేయకూడదన్న నిబంధన ఏదీ లేదంటూ బోధపరుస్తుంది. వివాహం అవగానే అగస్త్యుడు ఆమె రాజోచిత దుస్తులను అలంకారాలాను వదలి, ఒక తాపసి భార్యకు ఉచితమైన నార చీరలు ధరింపమని చెబుతాడు.
అప్పుడు ఆమెను గంగా ద్వార ప్రాంతానికి (నేటి హరిద్వార్) తీసుకొని వెళ్ళీ ఆశ్రమ జీవితం ప్రారంభిస్తాడు. ఆశ్రమ జీవితం చక్కగా గడిచిపోతున్నది. కొన్ని దినాలకు ఆయనకు పితృదేవతలకిచ్చిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. భార్యకు చెబుతాడు, అప్పుడు ఆమె భర్తతో ఇలా అంటుంది."ఆశ్రమవాస జీవితం బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలు అంటే మనము ఉన్న స్థితిలో శొభించదు. గృహస్థ జీవితం గడపడానికి ధనం, స్వర్ణం కావాలి" కావాలంటే తమ రూపాలను మార్చుకొని, కనక వర్షం కురిపింపగల తపః శక్తి ఆయనకు ఉన్నది. కాని ఆయనకు తన తపస్సును ఖర్చుపెట్టాలనిపించలేదు. భార్యతో " సంపాదన కష్టమేమీ కాదు. ఏరాజునడిగినా ఇస్తాడు. అని సమీపంలోని ఒక రాజ సభకు వెళ్తాడు.
శృతర్వుడు అనే రాజు వద్దకు అగస్త్యుడు వెళ్ళి, "రాజా నాకు కొంచెంధనము కావాలి" అని అడుగుతాడు. రాజుకు ఆశ్చర్యం, భయం కూడా వేశాయి. ఈ మహర్షి కనక వర్షం కురిపించగల తపశ్శాలి... నన్ను అడుగుతున్నాడు. ఆయనకు ఎంత కావాలో నేను ఈయగలనో లేదో అని సంకోచిస్తాడు. ఇద్దరు ముగ్గురు రాజులు ఆయనకు ఇవ్వడానికి వెనుకాడారు. అప్పుడు ఇల్వలుడు అనే రాక్షసాంశలో పుట్టిన రాజు వద్దకు వెడతాడు. ఆరాజు తమ్ముడి పేరు వాతాపి. కామరూపధారణ వంటి కొన్ని శక్తులున్నాయి, బ్రహ్మణులను చంపి తినేసేవారు.
వారికి కనిపించిన బ్రాహ్మణులతో "మాఇంట్లో పితృ కార్యం ఉన్నది. రేపు మాయింటికి భోక్తగా రండి" అని ఆహ్వానిస్తారు. వాతాపిని అన్న మేకగా మార్చి, చంపి ఆమాంసాన్ని ఆ బ్రాహ్మణునికి పెడతాడు. తరువాత "వాతాపీ రా" అని మంత్రిస్తే వాడు బ్రతికి, ఆ ముని పొట్టచీలుచుకొని, బయటకు వస్తాడు. ఈ ప్రకారంగా వాళ్ళు వీలైనప్పుడల్లా బ్రాహ్మణ మాంస భక్షణ చేసేవారు. అగస్త్యుడు ఇల్వలుని యొద్దకు ధనమడగటానికి వెడతాడు. అగస్త్యునికి అదే సత్కారం చేదామని ఇల్వలునికి అనిపిస్తుంది. ధనానికి ఏముంది.. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. ముందు మా ఇంటిలో భోజనం చేయండి అని ఆహ్వానిస్తాడు. మామూలుగానే వాతాపిని మేకగా మార్చి వండి వడ్డిస్తాడు. భోజనమవగానే అగస్త్యుడు " జీర్ణం.. జీర్ణం.. వాతాపి జీర్ణం" అని మూడు సార్లు అంటాడు. వాతాపీ రా!రా! అని ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా లాభంలేక పోయింది.
సముద్రజలమంతటినీ త్రాగిన అగస్త్యునికి వాతాపి ఒక లెక్కా?
ఇల్వలుడు భయంతో వణికి పోయాడు తన దగ్గరున్న బంగారమంతా ఆయనకే ఇచ్చాడు. ఈ లోకోపకార కృత్యం ఆయన వలన జరగటానికే ఈ సంఘటన జరిగినది. దీనికి కారణం అయ్యింది లోపాముద్ర. నేటికీ మన దేశంలో తల్లులు పసిపిల్లలకు ఆహారమిచ్చినప్పుడు "జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం" అనడం వింటాము. అది అగస్త్యమునిని, లోపాముద్ర ను తలచుకోవడమే.
లోపాముద్ర భారతీయ సాహిత్యంలో ప్రాచీన తత్వవేత్త. ఈమె అగస్త్యమహర్షి భార్య . ఈమె క్రీ.పూ 6వ లేదా 7వ శతాబ్దంలో జీవించినట్లు నమ్మకం. తన భర్తతో పాటు ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. ఈమెకు "కౌశితకి" మరియు "వరప్రద" అనే నామాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదం లో ఒక శ్లోకం ఆమె గురించి తెలియజేస్తుంది. మహా భారతంలో అగత్స్య మహర్షి "గంగద్వార" (హరిద్వార్) వద్ద తన భార్య అయిన లోపాముద్ర సహకారంలో తపస్సు చేసినట్లు ఉన్నది. ఈ దంపతులకు ద్రిధశ్యుడు అనే కుమారుడు ఉన్నాడు, ఆయన ఒక ప్రముఖ కవి. ప్రస్తుతం కావేరి నది లోపాముద్ర పునర్జన్మ పొందిన రూపం అని చెప్పబడుతుంది.
లోపాముద్ర విదర్భ రాజకుమారి. పురాణాల ప్రకారం లోపాముద్ర అగస్త్య మహర్షిచే సృషింపబడినదని, ఆయన వివిధ జంతువులలో అందమైన భాగాలతో(జింక కండ్లు మొదలైనవి) తయారుచేసినట్లు చెప్పబడింది. లోపాముద్ర అనగా వివిధ జంతువులలోని అందమైన భాగాలతో యేర్పడిన మహిళ అని అర్థము. ఆమెను సృష్టించిన తరువాత అగస్త్యుడు ఆమెను రహస్యంగా విదర్భ రాజ భవనానికి తరలించినట్లు చెప్పబడింది.
ఆమె పెరిగి పెద్దయిన తరువాత అగత్స్యుడు ఆమెను వివాహమాడమని కోరాడు. ఒక్కతే కుమార్తె అవడంతో గారాబంగా పెంచిన ఆమెను మునిపత్నిని చేసి అరణ్యాలకు పంపడం ఎలాగా అన్న ఆలోచనలో పడ్డాడు రాజు. బంగారంలాంటి పిల్లను కాపురం కోసం కానలకు పంపలేక తల్లిదండ్రులు సతమతం కావడం చూసిన లోపాముద్ర రుషిపత్నిగా మారడానికి తనకెలాంటి అభ్యంతరమూ లేదని తెలియజేస్తుంది. అగస్త్యుని కోసమే తాను జన్మించానని, రాచపుత్రిక అయినంతమాత్రాన అడవుల్లో కాపురం చేయకూడదన్న నిబంధన ఏదీ లేదంటూ బోధపరుస్తుంది. వివాహం అవగానే అగస్త్యుడు ఆమె రాజోచిత దుస్తులను అలంకారాలాను వదలి, ఒక తాపసి భార్యకు ఉచితమైన నార చీరలు ధరింపమని చెబుతాడు.
అప్పుడు ఆమెను గంగా ద్వార ప్రాంతానికి (నేటి హరిద్వార్) తీసుకొని వెళ్ళీ ఆశ్రమ జీవితం ప్రారంభిస్తాడు. ఆశ్రమ జీవితం చక్కగా గడిచిపోతున్నది. కొన్ని దినాలకు ఆయనకు పితృదేవతలకిచ్చిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. భార్యకు చెబుతాడు, అప్పుడు ఆమె భర్తతో ఇలా అంటుంది."ఆశ్రమవాస జీవితం బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలు అంటే మనము ఉన్న స్థితిలో శొభించదు. గృహస్థ జీవితం గడపడానికి ధనం, స్వర్ణం కావాలి" కావాలంటే తమ రూపాలను మార్చుకొని, కనక వర్షం కురిపింపగల తపః శక్తి ఆయనకు ఉన్నది. కాని ఆయనకు తన తపస్సును ఖర్చుపెట్టాలనిపించలేదు. భార్యతో " సంపాదన కష్టమేమీ కాదు. ఏరాజునడిగినా ఇస్తాడు. అని సమీపంలోని ఒక రాజ సభకు వెళ్తాడు.
శృతర్వుడు అనే రాజు వద్దకు అగస్త్యుడు వెళ్ళి, "రాజా నాకు కొంచెంధనము కావాలి" అని అడుగుతాడు. రాజుకు ఆశ్చర్యం, భయం కూడా వేశాయి. ఈ మహర్షి కనక వర్షం కురిపించగల తపశ్శాలి... నన్ను అడుగుతున్నాడు. ఆయనకు ఎంత కావాలో నేను ఈయగలనో లేదో అని సంకోచిస్తాడు. ఇద్దరు ముగ్గురు రాజులు ఆయనకు ఇవ్వడానికి వెనుకాడారు. అప్పుడు ఇల్వలుడు అనే రాక్షసాంశలో పుట్టిన రాజు వద్దకు వెడతాడు. ఆరాజు తమ్ముడి పేరు వాతాపి. కామరూపధారణ వంటి కొన్ని శక్తులున్నాయి, బ్రహ్మణులను చంపి తినేసేవారు.
వారికి కనిపించిన బ్రాహ్మణులతో "మాఇంట్లో పితృ కార్యం ఉన్నది. రేపు మాయింటికి భోక్తగా రండి" అని ఆహ్వానిస్తారు. వాతాపిని అన్న మేకగా మార్చి, చంపి ఆమాంసాన్ని ఆ బ్రాహ్మణునికి పెడతాడు. తరువాత "వాతాపీ రా" అని మంత్రిస్తే వాడు బ్రతికి, ఆ ముని పొట్టచీలుచుకొని, బయటకు వస్తాడు. ఈ ప్రకారంగా వాళ్ళు వీలైనప్పుడల్లా బ్రాహ్మణ మాంస భక్షణ చేసేవారు. అగస్త్యుడు ఇల్వలుని యొద్దకు ధనమడగటానికి వెడతాడు. అగస్త్యునికి అదే సత్కారం చేదామని ఇల్వలునికి అనిపిస్తుంది. ధనానికి ఏముంది.. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. ముందు మా ఇంటిలో భోజనం చేయండి అని ఆహ్వానిస్తాడు. మామూలుగానే వాతాపిని మేకగా మార్చి వండి వడ్డిస్తాడు. భోజనమవగానే అగస్త్యుడు " జీర్ణం.. జీర్ణం.. వాతాపి జీర్ణం" అని మూడు సార్లు అంటాడు. వాతాపీ రా!రా! అని ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా లాభంలేక పోయింది.
సముద్రజలమంతటినీ త్రాగిన అగస్త్యునికి వాతాపి ఒక లెక్కా?
ఇల్వలుడు భయంతో వణికి పోయాడు తన దగ్గరున్న బంగారమంతా ఆయనకే ఇచ్చాడు. ఈ లోకోపకార కృత్యం ఆయన వలన జరగటానికే ఈ సంఘటన జరిగినది. దీనికి కారణం అయ్యింది లోపాముద్ర. నేటికీ మన దేశంలో తల్లులు పసిపిల్లలకు ఆహారమిచ్చినప్పుడు "జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం" అనడం వింటాము. అది అగస్త్యమునిని, లోపాముద్ర ను తలచుకోవడమే.
Saturday, 31 December 2016
HEALTH BENEFITS WITH DEVOTIONAL POWERFUL WORD "OM"
ఓం అనే శబ్దం కేవలం ఆధ్యాత్మికతే కాదు నమ్మలేని ఆరోగ్య
ప్రజయోనాలున్నాయి
ఓం.. అన్నది మనకు మంత్రంగానే తెలుసు. కాని ఇప్పుడు పరిశోధకులు ఓం అనే శబ్దం కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనదిగా చూడరాదని పేర్కొంటున్నారు. వేదాల్లో ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రంగా నిక్షిప్తం చేశారు. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రోజుల తరబడి ఉపవాస దీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం వెనుక ఉన్నరహస్యం కూడా వారు ఓంకారాన్ని ఉచ్ఛరించడమేనట. పలు పాశ్చాత్య దేశాల్లోని యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని వెల్లడైంది.
ఓం అనే శబ్దాన్ని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని లయబద్ధంగా ఉచ్చరిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
* నాభిలోనుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగిన వారి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.
* 15 నిముషాల పాటు ఓంకారాన్ని ఉచ్చరిస్తే రక్తపోటు (బీపీ) తగ్గుతుంది.
* బ్లడ్ సర్య్కులేషన్ మెరుగుపడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
* మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.
* ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
* మెటబాలిజం (జీర్ణ క్రియ) వేగవంతం అవుతుంది.
* కిడ్నీల పనితీరు క్రమబద్ధం అవుతుంది.
* థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది.
ప్రజయోనాలున్నాయి
ఓం.. అన్నది మనకు మంత్రంగానే తెలుసు. కాని ఇప్పుడు పరిశోధకులు ఓం అనే శబ్దం కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనదిగా చూడరాదని పేర్కొంటున్నారు. వేదాల్లో ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రంగా నిక్షిప్తం చేశారు. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రోజుల తరబడి ఉపవాస దీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం వెనుక ఉన్నరహస్యం కూడా వారు ఓంకారాన్ని ఉచ్ఛరించడమేనట. పలు పాశ్చాత్య దేశాల్లోని యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని వెల్లడైంది.
ఓం అనే శబ్దాన్ని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని లయబద్ధంగా ఉచ్చరిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
* నాభిలోనుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగిన వారి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.
* 15 నిముషాల పాటు ఓంకారాన్ని ఉచ్చరిస్తే రక్తపోటు (బీపీ) తగ్గుతుంది.
* బ్లడ్ సర్య్కులేషన్ మెరుగుపడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
* మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.
* ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
* మెటబాలిజం (జీర్ణ క్రియ) వేగవంతం అవుతుంది.
* కిడ్నీల పనితీరు క్రమబద్ధం అవుతుంది.
* థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది.
Subscribe to:
Posts (Atom)






















