Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Obesity Health Tips. Show all posts
Showing posts with label Obesity Health Tips. Show all posts

Tuesday, 24 May 2016

HEALTHY ARTICLE ABOUT OBESITY


స్తౌల్య రోగం (Obesity ) 

శరీరం నందు కొవ్వు పెరగడానికి గల కారణాలు -

* దేహపరిశ్రమ లేని సుఖజీవనానికి అలవాటు పడటం. 

* కొవ్వును పెంచే తీపి, జిగట, నూనె పదార్దాలుని ఎక్కువ తినడం .

* అతిగా మాంసాహారం భుజించడం .

* పగటిపూట అతిగా నిద్రించడం .

* వీటివల్ల పెరిగే కొవ్వు శరీరంలో ని రసము, రక్తము మొదలయిన 7 ధాతువు మార్గాలకి అడ్డం పడటం వలన ఆహారం ధాతువులుగా మారే అవకాశం లేక కేవలం కొవ్వుగా పెరుగుతుంటుంది. దానివల్ల మనిషి ఏ చిన్న పని కూడా చేయలేని అసమర్దుడిగా అనారోగ్య పీడితుడు గా తయారవుతాడు.

కొవ్వు పెరగడం వలన అనర్ధాలు -

* ఎంత శ్వాస పీల్చినా సరిపోక వెంట వెంటనే శ్వాస పీల్చడం.

* నిద్రలో గురక రావడం .

* ఉబ్బసం, అతిదాహం , మేహా రోగాలు , మేహా వ్రణాలు , మూత్రరోగాలు , కుష్టు రోగాలు , జ్వరాలు రావడం.

* శరీరంలోని మోకాళ్ళు , నడుములు తుంటి , భుజాలు , మెడ మొదలయిన సందుల్లో వాతం చేరి వాతరోగాలు పుట్టడం.

* నరాల పటుత్వం తగ్గి సంభోగ శక్తి క్షీణించడం . 

స్తౌల్య రోగముని (Obesity ) హరించే ఔషధాలు - 2.

* శొంటి , మిరియాలు, పిప్పిళ్ళు , కరక్కాయ బెరడు , ఉశిరిక బెరడు, తానికాయ బెరడు ఇవన్ని సమభాగాలుగా తెచ్చి దోరగా వేయించి చిత్రమూలం , జీలకర్ర, పొంగించిన ఇంగువ ఈ మూడు పైన చెప్పిన దినుసులు లాగానే సమభాగాలుగా తీసుకుని అన్ని కలిపి మెత్తటి చూర్ణంగా తీసుకోవాలి . ప్రతిరోజు ఉదయమే రెండున్నర గ్రాముల చూర్ణం లో ఒక స్పూన్ తేనె కలిపి సేవించాలి . క్రమంగా అతికోవ్వు హరించి శరీరం సహజ స్తితికి వస్తుంది.

* ఎప్పుడు మంచినీరు తాగిన అరగ్లాస్ కంటే ఎక్కువ తాగకుండా తాగినప్పుడల్లా అరగ్లాస్ మంచినీళ్ళు గోరువెచ్చగా ఉండి అందులో 20 గ్రా తేనె కలిపి తాగుతూ ఉంటే రెండు మూడు నెలల్లో స్థూల శరీరం తగ్గి నాజూకుగా మారతారు.


* తగరం ( tin ) తో ఉంగరం చేయించి వేలికి తొడుక్కొని ఉంచుకుంటే కొవ్వు తగ్గిపోతుంది.

* దోరగా వేయించిన పిప్పిళ్ళ చూర్ణం రెండున్నర గ్రాములు అందులో సమంగా తేనే కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే స్తూల శరీరం తగ్గిపోతుంది .

కొవ్వు తగ్గటానికి తీసుకోవలిసిన జాగ్రత్తలు -

* శరీరానికి ఏదో విధమైన శ్రమ , వ్యాయమం తప్పనిసరిగా ఉండాలి.

* వంటికి నువ్వులనూనె లేక ఆవనూనేతో నలుగు పెట్టుకోవాలి.

* కొర్రలు, జొన్నలు, రాగులు, యవలు , ఉలవలు, శనగలు, పెసలు, కందులు, కారము, చేదు , వగరు పదార్దాలు సేవించాలి .

* వేయించిన వంకాయలు , త్రిఫలా చూర్ణం , తెల్ల ఆవాల నూనె , ఆకుకూరలు , వేడినీరు మొదలైనవి ఉపయోగించాలి.

* పగటినిద్ర అస్సలు పనికి రాదు.

* గేదేనేయ్యి , తీపి పదార్దాలు , పిండిపదార్ధాలు పూర్తిగా నిషేధించాలి.

* చేదు పదార్దాలు తీసుకుంటూ ఉంటే వళ్లు సన్నబడుతుంది .