Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Telugu Articles. Show all posts
Showing posts with label Telugu Articles. Show all posts

Friday, 4 March 2016

Friday, 30 October 2015

TELUGU ARTICLE ABOUT THE GREAT WRITER MAHA KAVI KALIDASU


కవికుల గురువు – కాళిదాస మహా కవి !
(సరసభారతి ఉయ్యూరు)

కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు .ఐదవ శతాబ్ది వాడని అనుకుంటారు .అభిజ్ఞాన శాకుంతలం నాటకం తో విశ్వ వ్యాప్త కీర్తి నార్జించిన వాడు .ఉపమా కాళిదాసస్య అనే టాగ్ ఉన్న కవి .

కుమార సంభవ కావ్యం లో హిమాలయ సౌందర్యాన్ని అత్యద్భుతం గా కీర్తిన్చాడుకనుక హిమాలయ సానువులలో ఉండే వాడేమో నని కొందరి ఊహ .మేఘదూతం కావ్యం లో ఉజ్జయిని ని కమనీయం గ చెప్పాడుకనుక ఉజ్జయిన వాసుడని మరి కొందరి అభిప్రాయం .రఘు వంశ కావ్యం లో కలింగ రాజు హేమాన్గదుడి గురించి రాశాడు కనుక కలింగ వాసి అని ఇంకొందరి అనుమానం .లక్ష్మీధర కల్లా అనే పరిశోధకుడు వీరికి భిన్నం గా కాశ్మీరుకు చెందిన వాడని చెప్ప్పాడు .అధిక సంఖ్యాకుల మనోభావం ప్రకారం కాళిదాస మహాకవి ఉజ్జయిని ప్రాంతం వాడే .ఒక రాజ కుమారిని వివాహం చేసుకొని ,చదువేమి లేక పోవటం తో సవాలు గా కాళికా దేవిని ప్రసన్నం చేసుకొని నాలుక పై బీజాక్షరాలు రాయించుకొన్న అదృష్ట వంతుడు .దానితో ఆయన మహా కవిగా రూపు దాల్చాడనే కద అందరికి తెలిసిందే .శ్రీ లంక రాజు కుమార దాసును కలిశాడని అక్కడ జరిగిన కుట్రలో హత్య చేయబడ్డాడనే కధనమూ ఉంది .

కాని కాళిదాసుకాలం నాలుగవ శతాబ్దికి విక్రమాదిత్య మహా రాజు కాలం తో సరిపోతోందని కొందరు వాదిస్తే, కాదు అయిదవ శతాబ్దపు చంద్ర గుప్తుని సమకాలీనుడని మరి కొందరి వాదన .ఇదంతా శుద్ధ తప్పు క్రీ పూ.ఒకటవ శతాబ్దం లోని అప్పటిఉజ్జయిని పాలకుడు విక్రమాదిత్యుని కాలం వాడని అన్నారు మరింత వెనక్కి నెట్టేసి .,ఆధునికులు మాత్రం అయిదు ఆరు శతాబ్దికి చెందాడు అంటారు .634శిలాశాసనం ప్రకారం బారవి కాళిదాసు పేర్లు ఒకే చోట కనిపించాయి .ఈ శాసనం కర్నాటక లోని ఐహోల్ లో లభించింది .,కాళిదాస కాలం పై చర్చను వదిలేసి ఆ మహాకవి రచనా వైవిధ్యాన్ని సామర్ధ్యాన్ని గురించి తెలుసు కొందాం .

మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ,మాళవికాగ్ని మిత్రం ,విక్రమోర్వశీయం అనే మూడు నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధ నాటకం గా గుర్తింపు పొందింది .జర్మనీ ఫిలాసఫర్ కవి విమర్శకుడు నాటక కర్త శాకుంతలాన్ని చదివి యెగిరి గంతేసి నాట్యం చేశడని ‘’దివిని భువిని ఏకం చేశాడు కాకాళి దాసు ‘’అని సంభ్రమాశ్చర్యాలతో ఆనంద బాష్పాలు కార్చాడని చెబుతారు .అంతటి కీర్తి పొందింది .ఇందులో నాలుగో అంకం నాలుగో శ్లోకం అన్నిటికంటే గొప్పది అనే పేరుంది కాన్వ మహర్షి పెంచిన కూతురు శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు కాలి దాసు ఆయనతో అనిపించినా శ్లోకే ఇది పెంచిన తండ్రి తానె దుఖాన్ని ఆపుకోలేక పోతుంటే కానీ పెంచి పెళ్లి చేసి అత్త వారింటికి కూతుర్నిపంపించే తల్లిదండ్రుల మనోక్షోభ ఎంతటిదో అనే భావం ఇందులో ఉంది .వీరేశలింగం గారు ఈ నాటాకాన్ని తెలుగులో గొప్పగా అనువదించారు .మాళవికాగ్ని మిత్రం అంటే ఆ ఇద్దరి కదా .మాళవిక అనే ఒక దాసీ పై ప్రేమలో పడిన రాజు అగ్ని మిత్రుడి కద .రాణి గారికి వీరి ప్రేమాయణం తెలిసి దాసిని నిర్బందిస్తుంది .మాళవిక రాజ పుత్రికయే నని తెలుస్తుంది .రెండవది అభిజ్ఞాన శాకుంతలం .దీని కద అందరికి తెలిసిందే .మూడవది విక్రామోర్వశీయం –పురూరవ రాజు దేవతా స్త్రీ ఊర్వశి ల ప్రణయం ఇతి వృత్తం .వీరి ప్రేమ అనేక ఆటంకాలకు లోననై చివరికి ఇద్దరూ ఏకమై ఊర్వశి విజయ విక్రమ అవుతుంది .

కాళిదాస మహా కవి మహా కావ్యాలు కుమార సంభవం ,రఘువంశం .పార్వతి దేవిజననం శివునితో కల్యాణం తాటక సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భావం కద కుమారా సంభవం .రఘు వంశ రాజుల చరిత్రను తెలిపేది రఘువంశం .ఈ రెండు కావ్యాలలో కాళిదాస ప్రతిభ బహుముఖీనం గా విస్తరించింది . గీర్వాణం అంటే దైవ స్వభావాన్ని పొందింది .వీటితో బాటు ఋతు ఘోష ,మేఘ దూతం అనే రెండు ఖండ కావ్యాలు రాశాడు కాళిదాసు భారత దేశ ఋతు వర్ణనను ప్రతిభా వంతం గా గా ఋతు ఘోషలో వర్ణించాడు .మేఘ దూతం లో మేఘాన్ని రాయ బారిగా ఒక యక్షుడు తన ప్రియురాలికి పంపిన సందేశాన్ని కవితాత్మకం గా దారిలో కనిపించే ప్రదేశాల వివరాలతో సహా రాశాడు .

కాళిదాసు కవితా ప్రతిభ

శృంగార రసాన్ని పిండి వడ బోశాడు కాళిదాసు .ఆయన దృష్టిలో ప్రపంచం రాగమయం గా దర్శన మిస్తుంది .వైదర్భీశైలి తో నాటకాలు రాశాడు .సులభ శైలిలోనే రాశాడు .ఆయన సూక్తులు రసమాదుర్యం తో తోణికిస లాడతాయి .శకుంతల సొందర్యమే కాళిదాసు కవితా సౌందర్యం ‘’అనాఘ్రాతమ్ పుష్పం కి.సలయ మలూనం కరరుహై –రానావిధం రత్నం మధునవ మనాస్వాదిత రసం –అఖండం పుణ్యానాం ఫల మివచ తద్రూప మనఘం ‘’.కవుల్లో అగ్రేసరుడు కాళిదాసు .దీన్ని ఒక కవి తమాషాగా చెప్పాడు ‘’కవులు ఎవరెవరు అని లెక్కించటానికి చిటికెన వేలుతో ప్రారంభిస్తే మొదటి వాడు కాళిదాసు రెండవ వాడు తగలనే లేదట అదీ ఆయన గొప్పతనం అంటాడు ..శాస్త్ర సంబంధ ఉపమానంకాలారాలు విరివిగా వాడాడు .

‘’తతో మందానిలోద్ధత కమలాకర శోభినా –గురుం నేత్ర సహ్శ్రేనా నోదయామాస వాసవః ‘’ఇంద్రుడు తనకున్న వెయ్యి కళ్ళతో గురువు బృహస్పతిని చూశాడట .ఆ కదలిక మెల్లని చల్లని గాలి చేత కమల వనం కదిలి నట్లు గా ఉందట. .మరో ఉపమాలంకారం –ఇందుమతీ స్వయం వరం లో రాజులు వరుసలో కూర్చున్నారు .ఆమె ఒక్కొక్కరిని చూస్తూ తిరస్కరిస్తూ వెడుతుంటే ప్రతివారికి తననే వరిస్తుందనే ఆశ తో ముఖం వెలిగింది .దాటిపోగానే ముఖాలు చిన్న బోయాయి .దీన్ని దీప శిఖ తో పోల్చాడు దీపం ముందుకు వెడుతుంటే వెనకాల చీకటిని వదిలి పెట్టటం సహజం కదా అలా ఉంది ఈ సీను .దీప శిఖా వర్ణన కాళిదాసు చాలా చోట్ల చేశాడు .దేని ప్రత్యేకత దానికి ఉంది .

ఉత్ప్రేక్ష లను ,అర్ధాంతర న్యాసాలను అర్ధవ వంతం గా వాడాడు .వాల్మీకి తర్వాత ప్రక్రుతి వర్ణనలకు కకాళిదాసుకే పేరు .ప్రకృతిని కవిత్వం లో చిత్రం గీసి చూపిస్తాడు .స్త్రీలను కోమలం గా వర్ణించాడు .వారికి ప్రత్యెక వ్యక్తిత్వం ఉంటుంది .సంవాదాలు నాటకీయం గా నడిపిస్తాడు .ఋతు సంహారం లో ఒక్కో సర్గలో ఒక్కో రుతువును వర్ణించాడు .మల్లినాద సూరి కాళిదాస కావ్యాలకు గొప్పగా టీకా తాత్పర్యాలు సంస్కృతం లో రాస్తే వేదం వెంకటరాయ శాస్త్రిగారు చక్కని తెలుగులో చెప్పారు .కాళిదాస రచనలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదం పొందాయి .కొందరు ఆంగ్ల కవి నాటక రచయితా షేక్స్ పియర్ తో కాళిదాసును పోలుస్తారుకాని కాళిదాసు ప్రతిభ ముందు ఆయన సరిపోలడని ఎక్కువ మంది అభిప్రాయం 

Sunday, 31 August 2014

Monday, 25 August 2014

Tuesday, 4 February 2014

Saturday, 24 August 2013

ARTICLE ON HEALTHY VITAMIN-K - EAT GREEN LEAVES AND VEGETABLES DAILY FOR OBTAINING VITAMIN-K




ARTICLE ON HEALTHY VITAMIN-K - EAT GREEN LEAVES AND VEGETABLES DAILY FOR OBTAINING VITAMIN-K