Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Cancer Health Tips. Show all posts
Showing posts with label Cancer Health Tips. Show all posts

Monday, 12 September 2016

PUT CHECK 2 CANCER WITH ZINGER AND MIRCHI - ALLAM AND MIRAPAYAKALU


అల్లం, మిర్చి కలిస్తే.. క్యాన్సర్‌కు చెక్‌!

ఘాటైన రుచులకు మీరు అభిమానులా? అయితే మీకో శుభవార్త. అల్లం, ఎండు మిర్చి కలిసిన ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. మిర్చిలోని కెప్సాయ్‌సిన్‌ సమ్మేళనాలతో జీర్ణాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని ఇదివరకటి పరిశోధనల్లో తేలింది. అయితే కెప్సాయ్‌సిన్‌ దుష్ప్రభావాలను అల్లంలో ఘాటును పెంచే జింజెరోల్‌-6 తగ్గించగలదని తాజాగా బయటపడింది. అంతేకాదు కెప్సాసిన్‌, జింజెరోల్‌ కలిస్తే.. క్యాన్సర్‌ కణితుల పెరుగుదలను నియంత్రిస్తాయని వెలుగులోకి వచ్చింది. ఎలుకలపై అమెరికన్‌ సొసైటీ వైద్యులు తాజా పరిశోధన నిర్వహించారు. జన్యు మార్పుల ద్వారా మొదటగా వాటిలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలను ప్రేరేపించారు. అనంతరం వాటిలో కొన్నింటిపై కెప్సాయ్‌సిన్‌, జింజెరోల్‌లను విడివిడిగా, మరికొన్నింటిపై రెండూ కలిపి ప్రయోగించారు. రెండూ కలిపి ప్రయోగించిన ఎలుకల్లో 80 శాతం వరకూ కణితుల పెరుగుదల నియంత్రణలోకి వచ్చినట్లు గుర్తించామని పరిశోధకులు లీ జియాహువాన్‌ వివరించారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిల నియంత్రణలోనూ అల్లం, మిర్చి కీలక పాత్ర పోషించే సంగతి తెలిసిందే.

Wednesday, 10 February 2016

BANANA PROTECTS FROM SKIN CANCER EXPERTS ANALYSIS


చర్మ క్యాన్సర్‌ చికిత్సలో.. అరటి తోడ్పాటు! 

అరటి పండు తొక్కపై కనిపించే నల్లమచ్చలు.. మానవ చర్మ క్యాన్సర్‌ను వేగంగా, తేలికగా గుర్తించేందుకు మార్గం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ కారణంగా అరటి పండ్ల తొక్కపై చిన్న, గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఇదే ఎంజైమ్‌ మానవ చర్మంపై కనిపిస్తుంది. 

ఈమచ్చలు చర్మక్యాన్సర్‌.. మెలనోమాతో బాధపడే వారిలోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఓ శాస్త్రవేత్తల బృందం ఈ ఏకరూపతను క్యాన్సర్‌ స్కానర్‌ను తయారు చేసేందుకు ఉపయోగించుకుంది. మానవ కణజాలంపై ఉపయోగించే ముందు అరటి తొక్కలపై పరీక్షించి చూసింది. ఈ ఎంజైమ్‌ మెలనోమా వృద్ధిని పట్టిచూపే మార్కర్‌గా పనిచేస్తుందని స్విట్జర్లాండు పరిశోధకులు పేర్కొన్నారు. పండ్లతో అధ్యయనం చేపట్టడం ద్వారా మానవ ముక్క పరీక్షలపై ప్రయత్నించడంకన్నా ముందే రోగనిర్ధరణ పరీక్ష పద్ధతిని అభివృద్ధి చేయగలిగినట్లు పరిశోధకులు హ్యూబర్ట్‌ గిరాల్ట్‌ పేర్కొన్నారు. దువ్వెన దంతాల తరహా మైక్రోఎలక్ట్రోడ్లతో ఉండే ఈస్కానర్‌ను చర్మంపై ఉంచినప్పుడు టైరోసినేజ్‌ ఎంజైమ్‌ పరిమాణం, వ్యాప్తిని గుర్తిస్తుందని వివరించారు. స్కానర్‌ను భవిష్యత్తులో కణతుల్ని నాశనం చేసేందుకూ ఉపయోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.