Search This Blog

Chodavaramnet Followers

Monday 28 January 2013

MAHARAJA KUMBHRANA'S MEMORIAL PILLAR AT RAJASTHAN


కుంభరాణా కీర్తి స్తంభం



రాజస్థాన్‌లోని చిత్తూర్‌గఢ్ కోట 500 అడుగుల ఎత్తున ఒక కొండపై ఉంటుంది. చారిత్రక సంఘటనలకు సాక్షీభూతాలుగా పలు భవనాలు, దేవాలయాలు, గోపురాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో విశిష్టమైన కీర్తిస్తంభం (జయస్తంభం) భారతీయ వాస్తుశాస్త్రానికి అద్వితీయమైన నమూనాగా కనిపిస్తుంది. ఈ గోపురం దాదాపు 120 అడుగుల ఎత్తుకలిగి ఉంటుంది. పునాదుల్లో దాదాపు 30 అడుగుల వ్యాసంతో ఉంటుంది. శిఖరాగ్రంలో గుమ్మటం 17 1/2 అడుగుల ఎత్తు న ఉంటుంది. ఇందులో 157 మెట్ల చుట్టూ ఒక గ్యాలరీని నిర్మించారు. ప్రతి అంతస్తులో ప్రతి ప్రాంగణంలోకి దారిచూపేలా 9 అంతస్తులు వెలుపలి ద్వారాలతో ఉంటాయి. గోపురం పైనుంచి పరిసర ప్రాంతాలను వీక్షించవచ్చు. మాళ్వా, గుజరాత్ రాజులపై తన విజయానికి స్మృతి చిహ్నంగా మేవార్‌కు చెందిన కుంభరాణా ఈ ప్రసిద్ధ గోపురాన్ని నిర్మించాడు.