Search This Blog

Chodavaramnet Followers

Tuesday 30 September 2014

DASARA FESTIVAL SPECIAL TELUGU ARTICLE - SOUNDARYA LAHARI





సౌందర్యలహరి

ఆది శంకరాచార్యుడు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంధము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి
శంకరాచార్యుని అనేక స్తోత్రాలలో శినస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. [1]
ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం
ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.
ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంధం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.
స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు "ఆనంద లహరి" అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే "సౌందర్య లహరి" అని అంటారు కాని ఈ విభజనను కొందరు వ్యాఖ్యాతలు అంగీకరించరు. భారత దేశంలో సౌందర్య లహరికి ఇంచుమించు 50 వ్యాఖ్యానాలున్నాయని తెలుస్తున్నది. లక్ష్మీధరుడు, భాస్కరరరాయుడు, కామేశ్వర సూరి, అచ్యుతానందుడు మొదలైనవారు ముఖ్య భాష్యకర్తలు. "Serpent Power" ("కుండలినీ శక్తి") అనే పేరు మీద "ఆనందలహరి" అనబడే భాగానికి మాత్రం "ఆర్థర్ ఎవలాన్" అనే ఆంగ్లేయుడు వ్యాఖ్యను వ్రాశాడు. "శ్రీరామ కవి" అనే పండితుడు "డిండిమ భాష్యము" అనే భాష్యాన్ని వ్రాశాడు. శ్రీ నరసింహ స్వామి అనే పండితుడు "గోపాల సుందరీయము" అనే వ్యాఖ్యలో ప్రతి శ్లోకాన్ని శక్తిపరంగాను, విష్ణుపరంగాను కూడా వ్యాఖ్యానించాడు. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు "శ్రీచక్ర విలసనము" అనే వ్యాఖ్యను వ్రాశాడు.[1]

అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను (స్తోత్రము, ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, అర్ధము, వినియోగము) స్మరించాలి. పిదప అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేయాలి. తరువాత శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి (జపించాలి). ఈ "సౌందర్య లహరి" స్తోత్రానికి
ఋషి - గోవిందః
ఛందస్సు - అనుష్టుప్
దేవత - శ్రీ మహాత్రిపుర సుందరి
బీజం - "శివః శక్త్యా యుక్తః"
శక్తి - "సుధా సింధోర్మధ్యే"
కీలకం - "జపో జల్పః శిల్పం"
అర్ధము - భగవత్యారాధన
వినియోగము - శ్రీ లలితా మహా త్రిపురసుందరీ ప్రసాద సిద్ధి కోసము
స్తోత్రమునుండి ఉదాహరణ శ్లోకములు
1వ శ్లోకము
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ,
అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి .
44వ శ్లోకము
తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్య లహరీ
పరీవాహస్రోతః సరణిరివ సీమంతసరణిః ,
వహంతీ సిందూరం ప్రబలకబరీ భార తిమిర
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణమ్
73వ శ్లోకము
అమూ తే వక్షోజావమృతరస మాణిక్య కుతుపౌ
న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః
పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూసంగమరసౌ
కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదలనౌ
రచన: ఆది శంకరాచార్య
ప్రథమ భాగః – ఆనంద లహరి
భుమౌస్ఖలిత పాదానామ్ భూమిరేవా వలంబనమ్ |
త్వయీ జాతా పరాధానామ్ త్వమేవ శరణమ్ శివే ||
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||
తనీయాంసుం పాంసుం తవ చరణ పంకేరుహ-భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకా-నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్-యైనం భజతి భసితోద్ధూళ నవిధిమ్|| 2 ||
అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ |
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి|| 3 ||
త్వదన్యః పాణిభయా-మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత-వరభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ || 4 ||
హరిస్త్వామారధ్య ప్రణత-జన-సౌభాగ్య-జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |
స్మరో‌உపి త్వాం నత్వా రతినయన-లేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ || 5 ||
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరు-దాయోధన-రథః |
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే || 6 ||
క్వణత్కాంచీ-దామా కరి కలభ కుంభ-స్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర-వదనా |
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో-పురుషికా || 7 ||
సుధాసింధోర్మధ్యే సురవిట-పివాటీ-పరివృతే
మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |
శివకారే మంచే పరమశివ-పర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద-లహరీమ్ || 8 ||
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వధిష్టానే హృది మరుత-మాకాశ-ముపరి |
మనో‌உపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే స హరహసి పత్యా విహరసే || 9 ||
సుధాధారాసారై-శ్చరణయుగలాంత-ర్విగలితైః
ప్రపంచం సిన్ఞ్ంతీ పునరపి రసామ్నాయ-మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగనిభ-మధ్యుష్ట-వలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||
చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్-వసుదల-కలాశ్చ్-త్రివలయ-
త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11 ||
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి-ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యా-దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ-సాయుజ్య-పదవీమ్ || 12 ||
నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతిత-మనుధావంతి శతశః |
గలద్వేణీబంధాః కుచకలశ-విస్త్రిస్త-సిచయా
హటాత్ త్రుట్యత్కాఞ్యో విగలిత-దుకూలా యువతయః || 13 ||
క్షితౌ షట్పంచాశద్-ద్విసమధిక-పంచాశ-దుదకే
హుతశే ద్వాషష్టి-శ్చతురధిక-పంచాశ-దనిలే |
దివి ద్విః షట్ త్రింశన్ మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖా-స్తేషా-మప్యుపరి తవ పాదాంబుజ-యుగమ్ || 14 ||
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత-జటాజూట-మకుటాం
వర-త్రాస-త్రాణ-స్ఫటికఘుటికా-పుస్తక-కరామ్ |
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ-ధురీణాః ఫణితయః || 15 ||
కవీంద్రాణాం చేతః కమలవన-బాలాతప-రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ |
విరించి-ప్రేయస్యా-స్తరుణతర-శ్రృంగర లహరీ-
గభీరాభి-ర్వాగ్భిః ర్విదధతి సతాం రంజనమమీ || 16 ||
సవిత్రీభి-ర్వాచాం చశి-మణి శిలా-భంగ రుచిభి-
ర్వశిన్యద్యాభి-స్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి-
ర్వచోభి-ర్వాగ్దేవీ-వదన-కమలామోద మధురైః || 17 ||
తనుచ్ఛాయాభిస్తే తరుణ-తరణి-శ్రీసరణిభి-
ర్దివం సర్వా-ముర్వీ-మరుణిమని మగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్య-ద్వనహరిణ-శాలీన-నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణ-గణికాః || 18 ||
ముఖం బిందుం కృత్వా కుచయుగమధ-స్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్ |
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందు-స్తనయుగామ్ || 19 ||
కిరంతీ-మంగేభ్యః కిరణ-నికురుంబమృతరసం
హృది త్వా మాధత్తే హిమకరశిలా-మూర్తిమివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా || 20 ||
తటిల్లేఖా-తన్వీం తపన శశి వైశ్వానర మయీం
నిష్ణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ |
మహాపద్మాతవ్యాం మృదిత-మలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద-లహరీమ్ || 21 ||
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాఞ్ఛన్ కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య-పదవీం
ముకుంద-బ్రమ్హేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ || 22 ||
త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ || 23 ||
జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి |
సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ-
స్తవాఙ్ఞా మలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః || 24 ||
త్రయాణాం దేవానాం త్రిగుణ-జనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయో-ర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహన-మణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే-శశ్వన్ముకులిత కరోత్తంస-మకుటాః || 25 ||
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ-వితతిరపి సంమీలిత-దృశా
మహాసంహారే‌உస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ || 26 ||
జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్ || 27 ||
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం
విపద్యంతే విశ్వే విధి-శతమఖాద్యా దివిషదః |
కరాలం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 28 ||
కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోఠీరే స్కలసి జహి జంభారి-మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ-ముపయాతస్య భవనం
భవస్యభ్యుత్థానే తవ పరిజనోక్తి-ర్విజయతే || 29 ||
స్వదేహోద్భూతాభి-ర్ఘృణిభి-రణిమాద్యాభి-రభితో
నిషేవ్యే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన-సమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్ని-ర్విరచయతి నీరాజనవిధిమ్ || 30 ||
చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థితస్తత్త్త-సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః |
పునస్త్వ-న్నిర్బంధా దఖిల-పురుషార్థైక ఘటనా-
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతర-దిదమ్ || 31 ||
శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్ర-స్తదను చ పరా-మార-హరయః |
అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||
స్మరం యోనిం లక్ష్మీం త్రితయ-మిద-మాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి-మహాభోగ-రసికాః |
భజంతి త్వాం చింతామణి-గుణనిబద్ధాక్ష-వలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత-ధారాహుతి-శతై || 33 ||
శరీరం త్వం శంభోః శశి-మిహిర-వక్షోరుహ-యుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన-మనఘమ్ |
అతః శేషః శేషీత్యయ-ముభయ-సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస-పరానంద-పరయోః || 34 ||
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి-రసి
త్వమాప-స్త్వం భూమి-స్త్వయి పరిణతాయాం న హి పరమ్ |
త్వమేవ స్వాత్మానం పరిణ్మయితుం విశ్వ వపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 35 ||
తవాఙ్ఞచక్రస్థం తపన-శశి కోటి-ద్యుతిధరం
పరం శంభు వందే పరిమిలిత-పార్శ్వం పరచితా |
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనా-మవిషయే
నిరాలోకే ‌உలోకే నివసతి హి భాలోక-భువనే || 36 ||
విశుద్ధౌ తే శుద్ధస్ఫతిక విశదం వ్యోమ-జనకం
శివం సేవే దేవీమపి శివసమాన-వ్యవసితామ్ |
యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ్-సారూప్యసరణే
విధూతాంత-ర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ || 37 ||
సమున్మీలత్ సంవిత్కమల-మకరందైక-రసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్ |
యదాలాపా-దష్టాదశ-గుణిత-విద్యాపరిణతిః
యదాదత్తే దోషాద్ గుణ-మఖిల-మద్భ్యః పయ ఇవ || 38 ||
తవ స్వాధిష్ఠానే హుతవహ-మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధ-కలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిర-ముపచారం రచయతి || 39 ||
తటిత్వంతం శక్త్యా తిమిర-పరిపంథి-స్ఫురణయా
స్ఫుర-న్నా నరత్నాభరణ-పరిణద్ధేంద్ర-ధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక-శరణం
నిషేవే వర్షంతం-హరమిహిర-తప్తం త్రిభువనమ్ || 40 ||
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మాన మన్యే నవరస-మహాతాండవ-నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా-ముదయ-విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జఙ్ఞే జనక జననీమత్ జగదిదమ్ || 41 ||
ద్వితీయ భాగః – సౌందర్య లహరీ
గతై-ర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీతయతి యః ||
స నీడేయచ్ఛాయా-చ్ఛురణ-శకలం చంద్ర-శకలం
ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ || 42 ||
ధునోతు ధ్వాంతం న-స్తులిత-దలితేందీవర-వనం
ఘనస్నిగ్ధ-శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం సహజ-ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ-విటపినామ్ || 43 ||
తనోతు క్షేమం న-స్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోతః-సరణిరివ సీమంతసరణిః|
వహంతీ- సిందూరం ప్రబలకబరీ-భార-తిమిర
ద్విషాం బృందై-ర్వందీకృతమేవ నవీనార్క కేరణమ్ || 44 ||
అరాలై స్వాభావ్యా-దలికలభ-సశ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ |
దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్క-రుచిరే
సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షు-ర్మధులిహః || 45 ||
లలాటం లావణ్య ద్యుతి విమల-మాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |
విపర్యాస-న్యాసా దుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకా-హిమకరః || 46 ||
భ్రువౌ భుగ్నే కించిద్భువన-భయ-భంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర-రుచిభ్యాం ధృతగుణమ్ |
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతే నిగూఢాంతర-ముమే || 47 ||
అహః సూతే సవ్య తవ నయన-మర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టి-ర్దరదలిత-హేమాంబుజ-రుచిః
సమాధత్తే సంధ్యాం దివసర్-నిశయో-రంతరచరీమ్ || 48 ||
విశాలా కల్యాణీ స్ఫుతరుచి-రయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురా‌உ‌உభోగవతికా |
అవంతీ దృష్టిస్తే బహునగర-విస్తార-విజయా
ధ్రువం తత్తన్నామ-వ్యవహరణ-యోగ్యావిజయతే || 49 ||
కవీనాం సందర్భ-స్తబక-మకరందైక-రసికం
కటాక్ష-వ్యాక్షేప-భ్రమరకలభౌ కర్ణయుగలమ్ |
అముంచ్ంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద-తరలౌ
అసూయా-సంసర్గా-దలికనయనం కించిదరుణమ్ || 50 ||
శివే శంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య-జననీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా || 51 ||
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తు-శ్చిత్తప్రశమ-రస-విద్రావణ ఫలే |
ఇమే నేత్రే గోత్రాధరపతి-కులోత్తంస-కలికే
తవాకర్ణాకృష్ట స్మరశర-విలాసం కలయతః|| 52 ||
విభక్త-త్రైవర్ణ్యం వ్యతికరిత-లీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయ మిద-మీశానదయితే |
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి-రుద్రానుపరతాన్
రజః సత్వం వేభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ || 53 ||
పవిత్రీకర్తుం నః పశుపతి-పరాధీన-హృదయే
దయామిత్రై ర్నేత్రై-రరుణ-ధవల-శ్యామ రుచిభిః |
నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువముమ్
త్రయాణాం తీర్థానా-ముపనయసి సంభేద-మనఘమ్ || 54 ||
నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతి
తవేత్యాహుః సంతో ధరణిధర-రాజన్యతనయే |
త్వదున్మేషాజ్జాతం జగదిద-మశేషం ప్రలయతః
పరేత్రాతుం శంంకే పరిహృత-నిమేషా-స్తవ దృశః || 55 ||
తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితా
నిలీయంతే తోయే నియత మనిమేషాః శఫరికాః |
ఇయం చ శ్రీ-ర్బద్ధచ్ఛదపుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘతయ్య ప్రవిశతి|| 56 ||
దృశా ద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపా కృపయా మామపి శివే |
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః || 57 ||
అరాలం తే పాలీయుగల-మగరాజన్యతనయే
న కేషా-మాధత్తే కుసుమశర కోదండ-కుతుకమ్ |
తిరశ్చీనో యత్ర శ్రవణపథ-ముల్ల్ఙ్య్య విలసన్
అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ || 58 ||
స్ఫురద్గండాభోగ-ప్రతిఫలిత తాట్ంక యుగలం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |
యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే || 59 ||
సరస్వత్యాః సూక్తీ-రమృతలహరీ కౌశలహరీః
పిబ్నత్యాః శర్వాణి శ్రవణ-చులుకాభ్యా-మవిరలమ్ |
చమత్కారః-శ్లాఘాచలిత-శిరసః కుండలగణో
ఝణత్కరైస్తారైః ప్రతివచన-మాచష్ట ఇవ తే || 60 ||
అసౌ నాసావంశ-స్తుహినగిరివణ్శ-ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫల-మస్మాకముచితమ్ |
వహత్యంతర్ముక్తాః శిశిరకర-నిశ్వాస-గలితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః || 61 ||
ప్రకృత్యా‌உ‌உరక్తాయా-స్తవ సుదతి దందచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |
న బింబం తద్బింబ-ప్రతిఫలన-రాగా-దరుణితం
తులామధ్రారోఢుం కథమివ విలజ్జేత కలయా || 62 ||
స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణా-మాసీ-దతిరసతయా చంచు-జడిమా |
అతస్తే శీతాంశో-రమృతలహరీ మామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజి కధియా || 63 ||
అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |
యదగ్రాసీనాయాః స్ఫటికదృష-దచ్ఛచ్ఛవిమయి
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా || 64 ||
రణే జిత్వా దైత్యా నపహృత-శిరస్త్రైః కవచిభిః
నివృత్తై-శ్చండాంశ-త్రిపురహర-నిర్మాల్య-విముఖైః |
విశాఖేంద్రోపేంద్రైః శశివిశద-కర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదనతాంబూల-కబలాః || 65 ||
విపంచ్యా గాయంతీ వివిధ-మపదానం పశుపతే-
స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే |
తదీయై-ర్మాధుర్యై-రపలపిత-తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీం నిచులయతి చోలేన నిభృతమ్ || 66 ||
కరగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరిశేనో-దస్తం ముహురధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే
కథంకరం బ్రూమ-స్తవ చుబుకమోపమ్యరహితమ్ || 67 ||
భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కన్టకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాల-శ్రియమియమ్ |
స్వతః శ్వేతా కాలా గరు బహుల-జంబాలమలినా
మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా || 68 ||
గలే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే
వివాహ-వ్యానద్ధ-ప్రగుణగుణ-సంఖ్యా ప్రతిభువః |
విరాజంతే నానావిధ-మధుర-రాగాకర-భువాం
త్రయాణాం గ్రామాణాం స్థితి-నియమ-సీమాన ఇవ తే || 69 ||
మృణాలీ-మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిః సౌంద్రయం సరసిజభవః స్తౌతి వదనైః |
నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ-మథనా దంతకరిపోః
చతుర్ణాం శీర్షాణాం సమ-మభయహస్తార్పణ-ధియా || 70 ||
నఖానా-ముద్యోతై-ర్నవనలినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీ-చరణతల-లాక్షారస-చణమ్ || 71 ||
సమం దేవి స్కంద ద్విపివదన పీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత-ముఖమ్ |
యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి || 72 ||
అమూ తే వక్షోజా-వమృతరస-మాణిక్య కుతుపౌ
న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |
పిబంతౌ తౌ యస్మా దవిదిత వధూసంగ రసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన-క్రౌంచ్దలనౌ || 73 ||
వహత్యంబ స్త్ంబేరమ-దనుజ-కుంభప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ |
కుచాభోగో బింబాధర-రుచిభి-రంతః శబలితాం
ప్రతాప-వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే || 74 ||
తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయః పారావారః పరివహతి సారస్వతమివ |
దయావత్యా దత్తం ద్రవిడశిశు-రాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా || 75 ||
హరక్రోధ-జ్వాలావలిభి-రవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసఙో మనసిజః |
సముత్తస్థౌ తస్మా-దచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి || 76 ||
యదేతత్కాలిందీ-తనుతర-తరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్ |
విమర్దా-దన్యోన్యం కుచకలశయో-రంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్ || 77 ||
స్థిరో గంగా వర్తః స్తనముకుల-రోమావలి-లతా
కలావాలం కుండం కుసుమశర తేజో-హుతభుజః |
రతే-ర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బేలద్వారం సిద్ధే-ర్గిరిశనయనానాం విజయతే || 78 ||
నిసర్గ-క్షీణస్య స్తనతట-భరేణ క్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకై-స్త్రుట్యత ఇవ |
చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ-తీర-తరుణా
సమావస్థా-స్థేమ్నో భవతు కుశలం శైలతనయే || 79 ||
కుచౌ సద్యః స్విద్య-త్తటఘటిత-కూర్పాసభిదురౌ
కషంతౌ-దౌర్మూలే కనకకలశాభౌ కలయతా |
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధ్మ్ దేవీ త్రివలి లవలీవల్లిభిరివ || 80 ||
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్
నితంబా-దాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే |
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబ-ప్రాగ్భారః స్థగయతి సఘుత్వం నయతి చ || 81 ||
కరీంద్రాణాం శుండాన్-కనకకదలీ-కాండపటలీం
ఉభాభ్యామూరుభ్యా-ముభయమపి నిర్జిత్య భవతి |
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిఙ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభ ద్వయమసి || 82 ||
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢ-మకృత |
యదగ్రే దృస్యంతే దశశరఫలాః పాదయుగలీ
నఖాగ్రచ్ఛన్మానః సుర ముకుట-శాణైక-నిశితాః || 83 ||
శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతః శేరసి దయయా దేహి చరణౌ |
యయ‌ఓః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయో-ర్లాక్షా-లక్ష్మీ-రరుణ హరిచూడామణి రుచిః || 84 ||
నమో వాకం బ్రూమో నయన-రమణీయాయ పదయోః
తవాస్మై ద్వంద్వాయ స్ఫుట-రుచి రసాలక్తకవతే |
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనా-మీశానః ప్రమదవన-కంకేలితరవే || 85 ||
మృషా కృత్వా గోత్రస్ఖలన-మథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |
చిరాదంతః శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశాన రిపుణా || 86 ||
హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక-చతురౌ
నిశాయాం నిద్రాణం నిశి-చరమభాగే చ విశదౌ |
వరం లక్ష్మీపాత్రం శ్రియ-మతిసృహంతో సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయత-శ్చిత్రమిహ కిమ్ || 87 ||
పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠిన-కమఠీ-కర్పర-తులామ్ |
కథం వా బాహుభ్యా-ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా || 88 ||
నఖై-ర్నాకస్త్రీణాం కరకమల-సంకోచ-శశిభిః
తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ |
ఫలాని స్వఃస్థేభ్యః కిసలయ-కరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ-మహ్నాయ దదతౌ || 89 ||
దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీం
అమందం సౌందర్యం ప్రకర-మకరందం వికిరతి |
తవాస్మిన్ మందార-స్తబక-సుభగే యాతు చరణే
నిమజ్జన్ మజ్జీవః కరణచరణః ష్ట్చరణతామ్ || 90 ||
పదన్యాస-క్రీడా పరిచయ-మివారబ్ధు-మనసః
స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి |
అతస్తేషాం శిక్షాం సుభగమణి-మంజీర-రణిత-
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే || 91 ||
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః
శివః స్వచ్ఛ-చ్ఛాయా-ఘటిత-కపట-ప్రచ్ఛదపటః |
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ || 92 ||
అరాలా కేశేషు ప్రకృతి సరలా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |
భృశం తన్వీ మధ్యే పృథు-రురసిజారోహ విషయే
జగత్త్రతుం శంభో-ర్జయతి కరుణా కాచిదరుణా || 93 ||
కలంకః కస్తూరీ రజనికర బింబం జలమయం
కలాభిః కర్పూరై-ర్మరకతకరండం నిబిడితమ్ |
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధి-ర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే || 94 ||
పురారంతే-రంతః పురమసి తత-స్త్వచరణయోః
సపర్యా-మర్యాదా తరలకరణానా-మసులభా |
తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతః స్థితిభి-రణిమాద్యాభి-రమరాః || 95 ||
కలత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా తవ సతి సతీనా-మచరమే
కుచభ్యా-మాసంగః కురవక-తరో-రప్యసులభః || 96 ||
గిరామాహు-ర్దేవీం ద్రుహిణగృహిణీ-మాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీ-మద్రితనయామ్ |
తురీయా కాపి త్వం దురధిగమ-నిస్సీమ-మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి || 97 ||
కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణ-నిర్ణేజనజలమ్ |
ప్రకృత్యా మూకానామపి చ కవితా0కారణతయా
కదా ధత్తే వాణీముఖకమల-తాంబూల-రసతామ్ || 98 ||
సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే
రతేః పతివ్రత్యం శిథిలపతి రమ్యేణ వపుషా |
చిరం జీవన్నేవ క్షపిత-పశుపాశ-వ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ || 99 ||
ప్రదీప జ్వాలాభి-ర్దివసకర-నీరాజనవిధిః
సుధాసూతే-శ్చంద్రోపల-జలలవై-రఘ్యరచనా |
స్వకీయైరంభోభిః సలిల-నిధి-సౌహిత్యకరణం
త్వదీయాభి-ర్వాగ్భి-స్తవ జనని వాచాం స్తుతిరియమ్ || 100 ||
సౌందయలహరి ముఖ్యస్తోత్రం సంవార్తదాయకమ్ |
భగవద్పాద సన్క్లుప్తం పఠేన్ ముక్తౌ భవేన్నరః ||
సౌందర్యలహరి స్తోత్రం సంపూర్ణం

స్తోత్ర సారాంశం

సౌందర్య లహరిలోని స్తోత్రాల విషయ సారాంశం ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వబడింది. (అనువాదం కాదు)
భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొదే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?
దేవి పాదరేణువు మహిమ గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాదపరాగాన్ని గ్రహించి శక్తిమంతులౌతున్నారు
దేవి అజ్ఞానులకు జ్ఞానాన్ని, చైతన్య రహితులకు చైతన్యాన్ని, దరిద్రులకు సకలైశ్వర్యాలను, సంసారమగ్నులకు ఉద్ధరణను ప్రసాదించునది.
తక్కిన దేవతలు వరదాభయముద్రలతో దర్శనమిస్తున్నారు. లోకరక్షకురాలైన శ్రీమాత పాదములే సకలాభీష్ట ప్రదాయములు, భయాపహములు, లోకరక్షకములు.
త్రైలోక్యమోహినియు, శ్రీచక్ర రూపిణియు అయిన శ్రీ త్రిపురసుందరీదేవిని పూజించి విష్ణువు మోహినీ రూపమును ధరించగలిగెను. మన్మధుడు లోకములను మోహింపజేయగలుగుచున్నాడు.
పార్వతి కటాక్షవీక్షణం వలన మన్మధుడు ఒంటరివాడైనను, శరీరహీనుడైనను, అల్పాయుధధారియైనను లోకములను వశీకరించుకొంటున్నాడు.
శ్రీదేవీ స్వరూప ధ్యానం: క్వణత్కాంచీధామా - మ్రోయుచున్న చిరుగంటల మొలనూలు కలది; కుంభస్తననతా - స్తన భారముచే కొంచెము వంగినది; పరిక్షీణామధ్య - కృశించిన నడుము కలది; పరిణత శరచ్చంద్రవదన - నిండు చందమామ వంటి మోము; ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - ధనుస్సును, పుష్పబాణములను, పాశమును, అంకుశమును చేతులలో ధరించినది; త్రిపురాంతకుని అహంకారరూపియైన దేవి.
"సుధా సింధోర్మధ్యే" - దేవియొక్క ఆవాసం వర్ణన - అమృత సముద్రమున, కల్పవృక్షముల తోటలలో మణిద్వీపం గురించి.
వేదాంతయోగసారము - శరీరంలోని షట్చక్రాల గురించి వర్ణన - కుండలినీ యోగ విధానము (ఆరోహణ)- సహస్రార చక్రంలో సదాశివునితో కలిసి దేవి విహరించుచున్నది.
కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే రెండ శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గం గురించి.
శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, 44 అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.
శ్రీలలితామహాభట్టారికామాత అనంత సౌందర్య స్తుతి, శివ సాయుజ్య ప్రసక్తి
దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.
సాత్విక ధ్యాన విధానం - శరత్కాలపు వెన్నెలను బోలు దేవికి నమస్కరించిన సజ్జనులకు అమృత రస తరంగిణులైన వాక్ప్రభావము లభించును.
రాజస ధ్యాన విధానం - అరుణాదేవిని ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు.
జ్ఞాన శక్తి రూపముననున్న, వశిన్యాది శక్తులతో కూడ దేవిని ధ్యానించువాడు మహాకావ్యములను వ్రాయగలడు.
ఇచ్ఛాశక్తి రూపమున కామరాజకూటమును అధిష్టించిన దేవిని ధ్యానించినయెడల వానికి అప్సరసలు కూడ వశులగుదురు.
అతి గోప్యము, గురువు ద్వారా గ్రహింపనగునది అయిన కామకలారూపము. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి ధ్యానము.
విష హరము, జ్వర హరము అగు ధ్యానము - దేవిని హృదయమున నిలుపుకొనువాడు అమృతతుల్యమగు తన చూపుచే, సర్పములను గరుత్మంతుడు శమింపజేసినట్లుగా, ఎట్టి జ్వరపీడితుల సంతాపమునైన పోగొట్టగలడు.
యోగ ధ్యాన విశేషము - సహస్రారంలోని చంద్రకళను ధ్యానించిన వారికి పరమానందము లభించును.
భక్తి మహిమ - తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును.
శివశక్తుల సంపూర్ణైక్యత
బ్రహ్మాండము యొక్క సృష్టిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవి.
సత్వరజస్తమోగుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాణి పాదపూజయే నిజమైన పూజ.
మహాప్రళయంలో సర్వమూ లయమైనాగాని సతీదేవి మాంగల్య మహిమవలన శివుడు మాత్రము విహరించుచున్నాడు.
జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."
దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడ నిరోధింప బడును.
శివుడు ఇంటికి వచ్చు సమయములో ధేవి ఎదురేగబోగా ఆమె కాలికి మ్రొక్కుచున్న బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల కిరీటములు అడ్డముగానున్నవని చెలులు హెచ్చరించుచున్నారు.
దేవిని నిరంతరము ధ్యానించు భక్తునకు ఎట్టి సంపదలు అవుసరము లేదు. వానికి ప్రళయాగ్నియే ఆరతివలె అగును.
దేవి నిర్బంధము కారణముగా 64 తంత్రములను శివుడు భూతలమునకు తెచ్చెను.
దేవీ మంత్రరాజము అయిన పంచదశాక్షరి సకలపురషార్ధ సాధకము. ఈ శ్లోకములో పంచదశాక్షరి సంకేతములతో చెప్పబడినది. (షోడశాక్షరి మంత్రము గుహ్యము. గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను. కనుక ఈ శ్లోకములో 15 అక్షరములే చెప్పబడినవి.)
కౌలులు బాహ్య విధానములో చేయు దేవి అర్చన వర్ణన. ఈ శ్లోకము బీజాక్షరములున్నవి. ఇది అధికారము, ఐశ్వర్యము, మోక్షము అవంటి ప్రయోజనములను కలిగించును.
శివశక్తుల ఐక్యత గురించి. నవ వ్యూహాత్మకమైన భైరవస్వరూపము ఇందు వర్ణితము. శివుడు ఆనంద భైరవుడు. పరాశక్తియే మహాభైరవి. వారు వేరు వేరు కాదు.
షట్చక్రములందున్న పృధివ్యాధి తత్వములు దేవియే. అన్ని రూపములు ఆమెయే.
ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబ.
విశుద్ధి చక్రము నందలి దేవీ తత్వము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి.
అనాహత చక్రము నందలి హంస ద్వంద్వమునకు వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - హంసేశ్వరుడు, హంసేశ్వరి
స్వాధిష్ఠాన చక్రము నందలి సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ
మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని
మూలాధార చక్రము నందు నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)
మొదటి 41 శ్లోకములు "ఆనంద లహరి"యనబడును.
42వ శ్లోకమునుండి "సౌందర్య లహరి"గా భావింపబడుచున్నది.
ద్వాదశాదిత్యులనే మణులతో కూర్చబడిన దేవి కిరీటం వర్ణన.
దేవి కురులు అజ్ఞానమును నశింపజేయునని వర్ణన.
దేవి పాపట నడుమనున్న సిందూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.
ముంగురులచే కమ్ముకొనిన దేవి ముఖము పద్మమును పరిహసించుచున్నది. ఆమె చిరునగవు శివుని మోహింపజేయుచున్నది.
లావణ్యకాంతితో నిర్మలమైన దేవి ఫాలము రెండవ చంద్రఖండమువలెనున్నది. మొదటి చంద్రఖండమును దేవి తలయందు ధరించినది.
దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి.
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖవిజయము కలదై యున్నది.
దేవి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్యభరితమైన చెవులనెడు పుష్పములనుండి మకరందమునాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది.
శ్రీ అమ్మవారి చూపు శివునియందు శృంగారము గలది. అన్యులయందు భీభత్సము గలది. గంగ (సవతి) యందు కోపము గలది. శివుని చరిత్రయందు అద్భుతము గలది. శివుడు ధరించిన సర్పములవలన భయమొందినది. పద్మమును మించిన సౌందర్యము గలది. చెలులయందు చిఱునగవులు గలది. నాయందు (ఆది శంకరాచార్యుని యందు లేదా భక్తునియందు) దయ గలది.
దేవి కన్నులు ఆమె చెవులవరకు లాగబడిన, రెప్పల వెండ్రుకలనెడు ఈకలు కలిగిన మన్మధ బాణములవలెనున్నవి. ఈశ్వరుని చిత్తమును కలచివేయుటయే ఆ బాణముల లక్ష్యము.
దేవి మూడు కన్నులందును కాటుక ధరించియన్నందున ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములు మిళితములైయున్నవి. మహాప్రళయమునందు పరమాత్మలో లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులను భవానిదేవి శివునితోగూడి మరల సృజించుటకై ధరించిన సత్వ రజస్ తమో గుణములవలె ప్రకాశించుచున్నవి.
దేవి కన్నులలోని ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఎఱ్ఱని శోణానది, తెల్లని గంగానది, నల్లని యమునానది అనెడు తీర్ధముల పాపహరమైన సంగమము వలె యున్నవి.
జగన్మాత కనులు మూయుటవలన లోక సంహారము, తెరచుట వలన సృష్టి జరుగునందురు. సకల జగములను రక్షించుటకొరకై ఆమె రెప్పలు మూయకుండ ఉండునని కవి తలపు.
అపర్ణాదేవి కన్నులు మీనములవలెనున్నవని వర్ణన.
శివాణీ! నీ చల్లని చూపును నాపై ప్రసరింపజేయుమని ప్రార్ధన.
పర్వతరాజపుత్రి కనుల అంచులు ధనుస్సులవలెనున్నవి. ఆ దేవి కడగంటి చూపులు బాణములను ఎక్కుపెట్టుచున్నవా అన్నట్లు ఆ కనుల అంచులను దాటి చెవులవరకు పోవుచున్నట్లు భ్రమను కలుగజేయుచున్నవి. (ఆ విశాలాక్షి కన్నులు చెవులవరకు వ్యాపించియున్నవని భావము)
దేవి చెక్కిళ్ళలో ప్రతిబింబించుచున్న ఆమె తాటంకముల కారణముగ ఆమె ముఖము నాలుగు చక్రములు కలిగిన మన్మధుని రధమువలె నున్నది. అట్టి సుందర ముఖము నాశ్రయించి మన్మధుడు శివునితో తలపడుటకు సంసిద్ధుడయ్యెను.
సరస్వతీదేవి అమృత సూక్తులను వినుచు శర్వాణి తలయూపుచున్నది. ఆమె కుండలముల ఝణంఝణ నాదములు సరస్వతి పలుకులను ప్రశంసించుచున్నవనిపించునట్లున్నవి.
హిమద్వంశ కీర్తిపతాకయైన దేవి నాసిక నుండి వెలువడు చల్లని నిశ్వాసము మాకు అభీష్టఫలములను ప్రసాదించును గాక.
దేవి ఎఱ్ఱని పెదవికి పోలిక చెప్పవలెనంటే పండిన పగడపు తీగనే సామ్యముగా చెప్పవలెను. దొండపండుతో పోల్చడం సరి కాదు.
చకోర పక్షులు దేవి చిఱునగవులనే వెన్నెలను గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున అందుకు విరుగుడుగా అమృతమును పుల్లని కడుగునీళ్ళగా భావించి త్రాగుచున్నవి.
జగజ్జనని నాలుక ఎల్లపుడు శివుని గుణగణముల వర్ణనలు చేయుచు వెలయుచుండును. ఆమె నోటి ఎరుపు ప్రతిఫలించిన కారణముగా తెల్లని చాయ గలిగిన సరస్వతి మేను కూడ ఎరుపుగా అగుపించుచున్నది.
యుద్ధమునందు దైత్యులను జయించి తిరిగి వచ్చుచున్న కుమార స్వామి (విశాఖుడు), ఇంద్రుడు, విష్ణువులు చండాంశము (చండుడు అను శివభక్తుని భాగము) అయిన శివనిర్మాల్యమును తీసికొననిచ్చగించలేదు. వారు దేవి పాదములచెంత చేరి, తమ శిరస్త్రాణములను తొలగించి, మ్రొక్కుచు ఆమె యొసగిన కర్పూర సహిత తాంబూల శకలములను ఆతురతతో స్వీకరించుచున్నారు.
సరస్వతీ దేవి శివుని గాధలను ఆలపించుచుండగా వినుచు జగన్మాత ఆనందముతో తలయూపుచున్నది. దేవి ప్రశంసావాక్యములలోని వాఙ్మాధుర్యమునకు సరస్వతి వీణాతంత్రుల సవ్వడి సరికాకున్నది.
గిరిసుత చుబుకము తండ్రిచే ప్రేమగా పుణకబడినది. శివునికి దేవి ముఖము అద్దము కాగా ఆ అద్దమునకు పిడివంటిది ఆమె చుబుకము. దానిని పోల్చుటకు మరేదియును సాటిరాదు.
శివుని కౌగిలిచే రోమాంచకమైన దేవి గళము ఆమె ముఖమనెడు పద్మమునకు కాడవలెనున్నది. ఆ క్రింద అగురు బురద అలముకొనియున్న ముత్యాల కంఠహారము బురదలో కూరుకొనిపోయిన తామరతూడువలెనున్నది.
సంగీత రసజ్ఞురాలవగు ఓ తల్లీ! వివాహ సమయమున మంగళసూత్రము కట్టిన పిదప కట్టెడు మూడుదారములయొక్క గుర్తులా యనబడునట్లుగా నీ కంఠమునందలి మూడు రేఖలు నానావిధమనోహరములైన మూడురాగములకు హద్దులవలె భాసించుచున్నవి.
దేవి నాలుగు చేతుల స్తుతి - (పూర్వము బ్రహ్మకు ఐదు తలలుండెడివని, అందొక తలను రుద్రుడు తన గోటితో చిదిమివేసెనని ఇతిహాసము). శివుని గోళ్ళకు భయపడిన బ్రహ్మ తన నాలుగు తలలను రక్షించుకొనుటకై నాలుగు ముఖాలతోను ఒకేమారు శ్రీమాత యొక్క సుకుమారమైన, తామరతూండ్లవంటి బాహువులను స్తుతించుచున్నాడు.
దేవి చేతి గోళ్ళ ప్రశంస - ఉమాదేవియొక్క చేతిగోళ్ళ సహజమైన అరుణవర్ణము పద్మముల రంగును పరిహసించుచున్నది. వాటి అందమును దేనితో పోల్చవచ్చును? లక్ష్మీదేవి విహరించునపుడు ఆమె పాదతలములందలి లాక్షారసము అంటి ఎఱ్ఱనైన కమలదళాలతో కొంతవరకు సామ్యము చెప్పవచ్చును.
దేవి స్తనయుగము వర్ణన - కుమారస్వామి చేతను, గజముఖునిచేతను ఒక్కసారే పాలు త్రాగబడి పాలు గారుచున్న దేవి స్తనయుగము మా కష్టములను పోగొట్టును గాక. ఆ స్తనద్వయమును చూచి గజాననుడు తన కుంభస్థలమును తల్లి అపహరించెనేమోయని కలతచెందుచున్నాడు.
పార్వతీదేవి వక్షోజములు కెంపులచే చేయబడిన అమృత కలశములు. కనుకనే ఆమె స్తన్యము గ్రోలిన గజాననుడు, కుమారస్వామి బాలురవలెనే యున్నారు. (వృద్ధులు అగుట లేదు)
అంబ కుచ ప్రదేశమునందున్న హారము గజాసురుని కుంభములందలి ముత్యములచే కూర్చబడినది. అట్టి తెల్లని స్వచ్ఛమైన హారము దేవి అధరకాంతులచే లోపల కొంచెము ఎర్రనై, ఈశ్వరుని కీర్తి, ప్రతాపము మిళితమైనట్లుగా భాసించుచున్నది.
దేవి స్తన్యము యొక్క మహిమ - పర్వతపుత్రి స్తన్యము ఆమె హృదయమునందలి పాలకడలినుండి పుట్టిన వాఙ్మయము. కనుకనే దయతో దేవి యొసగిన స్తన్యమును గ్రోలిన ద్రవిడశిశువు ప్రౌఢకవుల మధ్య కమనీయకనియయ్యెను.
దేవి నాభి వర్ణన - హరుని కోపాగ్నిచే దహింపబడుచున్న మన్మధుడు ప్రాణరక్షణకొరకు పార్వతి నాభి అను సరస్సులో దూకెను. వాని శరీరమునుండి వెడలి తీగవలె సాగిన పొగనే పామర జనము ఆమె నూగారని అనుచున్నారు.
దేవి నూగారు వర్ణన - శివాణి సన్నని నడుమునందు యమునానది సూక్ష్మతరంగములవలె (అతి చిన్నవైన) రోమావళి యున్నది. ఆమె కుచకుంభముల ఒరిపిడివలన వాని మధ్యనున్న ఆకాశము(స్థలము)నకు చోటు చాలలేదు. కనుక ఆ యాకాశము క్రిందికి జారి ఆమె నాభి రంధ్రమున చోటుచేసుకొనెనా యన్నట్లుగా అవియనిపించుచున్నవి.
గిరిపుత్రీ! నీ నాభి నిశ్చలమైన గంగ సుడి. స్తనములు అను పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి యనెడు తీగకు పాదు. మన్మధుని పరాక్రమాగ్నికి హోమగుండము. రతీ దేవికి విహార గృహము. ఈశ్వరుని కనుల సిద్ధికి గుహాముఖము. అయి విరాజిల్లుచున్నది.
శైల తనయ నడుము వర్ణన : సహజముగానే కృశించినది. స్తన భారముచే వంగినది. నాభియు, వళులు (మడతలు)ను ఉన్న చోట విఱిగిపోవునో యన్నట్లున్నది. ఒడ్డు విఱిగిన నదీ తీరమున ఉన్న చెట్టువలె ఊగుచున్నది.
దేవి వళుల వర్ణన : మన్మధ నిర్మితములై కనక కలశములవంటి దేవి స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.
దేవి నితంబము వర్ణన: పార్వతీ! నీ తండ్రి యగు క్షితిధరపతి భూమినుండి విస్తారమును తీసి నీకు అరణముగా నిచ్చెను. అందున నీ నితంబము (పిఱుదులు) విస్తారమై వసుమతి (భూమి)ని కప్పివైచుచు తేలిక చేయుచున్నవి.
భవతి తొడలు, మోకాళ్ళ వర్ణన : పార్వతీదేవి తొడలు గజరాజు తుండములను, బంగారపు అరటి కంబములను జయించునవి. భర్తకు సదా మ్రొక్కుచుండుటచే ఆమె మోకాళ్ళు గట్టిపడినవి.
83 నుండి 91వ శ్లోకము వరకు దేవి పాదములు, గోళ్ళ వర్ణన యున్నది.
గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
మాతా! నీ పాదములు వేదములకు శిరోభూషణములు. నీ పాద్య జలమే శివుని జటాజూటముననున్న గంగ. విష్ణువు తలపైనున్న చూడామణి కాంతియే నీ శ్రీ పాదముల లత్తుక శోభ. తల్లీ నీ పాదములను దయతో నా శిరసుపైనుంచుమమ్మా.
దేవీ! తడి లత్తుకతో కాంతులీనెడు నీ పాదద్వయమునకు మ్రొక్కెదను. నీ పాదముల తాకిడిని పొందుచున్న ప్రమదావనమునందలి అశోకవృక్షమును చూచి శివుడు అసూయ చెందుచున్నాడు.
ప్రణయ కలహ సమయమున దేవి తన కాలితో శివుని లలాటమున తన్నినది. అప్పుడు ఆమె అందెల మోత యెట్లున్నది? తన శత్రువైన శివునికి పరాభవము కలిగినందుకు మన్మధుడు కిలకిల నవ్వినట్లున్నది.
జననీ! శ్రీకరములు, సదా శోభాయమానములు అయిన నీపాదములను పద్మములతో ఎట్లు పోల్చనగును? పద్మములు రాత్రులు ముకుళించుకొనిపోవును. మంచు తగిలిన వడలి పోవును. అవి కొంచెము మాత్రమే లక్ష్మి అనుగ్రహమునకు పాత్రములు.
దేవీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.
చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.
తల్లీ! నీ పాదములు ఎల్లప్పుడు కోరిన సంపదలనిచ్చునవి. సౌందర్యమనెడు మకరందమును వెదజల్లెడు కల్పవృక్షపు పుష్పగుచ్ఛములు. ఆఱు ఇంద్రియములతో (మనసు + జ్ఞానేంద్రియములు) గూడిన నా జీవము ఆఱు కాళ్ళ తుమ్మెదవలె నీపాదములను ఆశ్రయించును గాక.
మాతా! సుందర గమనా! నీ భవనములోని పెంపుడు హంసలు నీ నడకల తీరును నేర్చుకొన గోరి, నీ వెంటనే తిరుగుచున్నవి. నీ పాదముల మణిమంజీరములు (అందెలు) ఆ హంసలకు పదన్యాసమునందు శిక్షణ నిచ్చుచున్నట్లుగా ఉన్నది.
42వ శ్లోకము నుండి 91వ శ్లోకము వరకు శంకరాచార్యుడు శ్రీమాత కిరీటము నుండి పాదములవరకు స్తుతించాడు. ఇప్పుడు దేవి సంపూర్ణ స్వరూపము వర్ణింపబడుచున్నది.
దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులు నీకు సమీప సేవను పొందుటకై నీ మంచమునకు కోళ్ళుగా ఉన్నారు. శివుడు తెల్లని కాంతి అను మిషతో నీకు పైని కప్పుకొనుటకు దుప్పటియైనాడు. అట్టి సదాశివుడు నీ యెఱ్ఱని దేహకాంతులు ప్రతిఫలించిన కారణమున తానును ఎఱ్ఱబారి మూర్తీభవించిన శృంగార రసము వలెనుండి నీ కనులకు వినోదము గొలుపుచున్నాడు. (శివుని శరీర వర్ణం తెలుపు. దేవి శరీర వర్ణం ఎఱుపు.)
కామేశ్వరి సంపూర్ణ సౌందర్య స్తుతి - శివాణి కేశములు వక్రమైనవి. సహజ మందహాసము సరళమైనది. దేహము శిరీష పుష్పము వలె మృదువైనది. కుచ ప్రాంతము కఠినమైనది. నడుము లతవలె సన్ననైనది. నితంబములు విశాలమైనవి. సదాశివుని కరుణా శక్తి మూర్తీభవించిన రూపమే ఆ సౌందర్యమూర్తి. అట్టి అరుణాదేవి లోకములను రక్షించుటకు జయమొందుగాక.
సూర్యుడు దేవి పాదములవద్ద సేవ చేయుచున్నాడు. తన కిరణ తీవ్రతను ఉపశమించి, అద్దమువలె ధగధగలాడుచున్నాడు. ఆ అద్దములో దేవి ముఖపద్మము కనుపించుచున్నది. (సూర్యుని హృదయ ఫలకములో దేవి ముఖము ప్రతిబింబించుచున్నది). ఆ పద్మము సదా వికసించియున్నందున చంద్రుని బాధ లేదు (రాత్రి కాదు కనుక సూర్యుని సేవకు అంతరాయము లేదు).
చంద్రబింబమును దేవి అలంకరణ సామగ్రి పెట్టెగా చెప్పుట - దేవీ! చంద్రబింబము జలమయమైన మరకత మణితో చేయబడిన పెట్టె. అది కళలు అనే కర్పూరముతో నిండియున్నది. నీవు వాడుకొనే కస్తూరియే అందులో కనుపించే మచ్చ. ప్రతిదినము దీనిలోని వస్తువులను (కస్తూరిని, కర్పూర శకలాలను) నీవు వాడుకొనుచుండుట చేత ఆ పెట్టె తగ్గిపోతున్నది. (దానిలోని రంధ్రము పెద్దగా అగుచున్నది.) దానిని బ్రహ్మ మరల పూరిస్తూ ఉన్నాడు. (చంద్రునిలోని హెచ్చుతగ్గులు - కృష్ణ పక్షము, శుక్ల పక్షము).
దేవీ! నీవు త్రిపురారి అంతఃపురాధిదేవతవు. (శివుని పట్టపురాణివి). నీ పాదసేవ దుర్లభము. కనుక ఇంద్రాది దేవతలు నీ ద్వారముచెంత కావలిగానున్న అణిమాది సిద్ధుల ప్రసాదములతో అతులమైన ఇష్టసిద్ధులను పొంది తృప్తులగుచున్నారు.
సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడ లభించదు.
గిరిజా దేవీ! వేదవిదులు నిన్ను సరస్వతి యనియు, లక్ష్మి యనియు, పార్వతి యనియు చెబుతారు. కాని నీవు ఈ మువ్వురికంటె వేరైన మహామాయవు. పరబ్రహ్మయగు సదాశివుని దేవియగు చంద్ర కళగా ఆరాధింపబడు శ్రీవిద్యవు. దేశకాల పరిమితులకు అతీతమైన మహిమ గల దానవు. మహామాయవై విశ్వమును భ్రమింపజేయుచున్నావు.
ఉమా దేవీ! సముద్భూత స్థూల స్తనభరమైన వక్షోభాగము,మనోహరమైన దరహాసము, కడగంటి చూపులందు మన్మధులు, కదంబమువంటి ప్రభ కలిగిన తనువు - ఈ గుణములన్నియు శివుని మనస్సునందు నీవేయను భ్రాంతి కలిగించును. నిర్మలమైన మనస్సుతో దేవిని ధ్యానించు భక్తులకు ఈ గుణములు కలుగుటయే వారి భక్తికి పరమావధి.
తల్లీ! నేను జ్ఞానార్ధిని. నీ పాదములు కడిగినపుడు లత్తుక రసముతో ఎఱ్ఱనైన నీ పాదోదకమును త్రాగే భాగ్యము నాకెప్పుడు లభిస్తుందో? అది మూగవారిని కూడ కవులుగా చేయునది. ఆ జలమునకు సరస్వతీ దేవి ముఖ తాంబూల రస గుణము కలిగనది.
(ఈ శ్లోకములో షట్‌-కమల భేదనము, సహస్రార కమలమును చేరుకొనుట సూచింపబడినవి) దేవీ! సాదాఖ్య చంద్రకళ యగు నిన్ను భజించువాడు విద్యను, ఐశ్వర్యమును పొంది (సరస్వతిని, లక్ష్మిని వశము చేసుకొని) బ్రహ్మకును, విష్ణువునకును విరోధిగా వెలుగుచున్నాడు. రమ్యమైన రూపము పొంది రతీదేవి పాతివ్రత్యమును శిధిలము చేయగలడు. చిరంజీవియై జీవుని అవిద్యను జయించి బ్రహ్మానంద రసమును ఆస్వాదించును. (సాదాఖ్య కళను ఉపాసించు వానికి ఐహికాముష్మిక ఫలములు రెండును సిద్ధించును)
సర్వ జ్ఞానములకు, సకలైశ్వర్యములకు నిధియైన శ్రీదేవీ! నిత్య మందహాస వదనా! నిరవధిక గుణ నిధానమా! నీతి నిపుణా! నిరాటంక జ్ఞానా! నియమ వశమైన చిత్తములందు నివశించుదానా! నియమ విధులకు కట్టుబడని దానా! నిఖిల నిగమాంత స్తుత పదా! ఆపదలు, ఆటంకములు సమీపించని దానా! నిత్యా! నా స్తుతిని కూడ స్వీకరించు తల్లీ! (చండిక స్తోత్రము చేతను, భాస్కరుడు నమస్కారము చేతను, విష్ణువు అలంకారము చేతను, శంకరుడు అభిషేకము చేతను సంతుష్టులగుదురు.)
సర్వ వాక్కులకు జననీ! ఈ విశ్వములోని వాక్కులన్నయును నీవే! కనుక నా స్తోత్రములోని వాక్కులు కూడా నీవే! అట్టి నీ వాక్కులచేతనే నిన్ను స్తుతించుచుంటిని. దీప కాంతులతో సూర్యునికి నీరాజనమిచ్చినట్లుగాను, చంద్రకాంత శిలా జలముచే చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లుగాను, జలములతో సముద్రుని తృప్తి పరచినట్లుగాను నేను నీ వాక్కులచేత నిన్ను స్తుతించి నీకు ప్రీతి కలిగింపనెంచితిని.శిశువు పలుకులు నిరర్ధకమైనవైనను తల్లికి ఆనందమే కలిగించును కదా! అట్లే ఈ భక్తుని స్తుతి సకల లోకమాతవగు నీకు ఆనందము కలిగించును గాక.
శ్రీవిద్యా రహస్యాలు, మంత్ర శాస్త్రం
శాక్తేయ సంప్రదాయంలో శ్రీవిద్య చాలా ముఖ్యమైనది. శ్రీవిద్య అంటే వివిధ రకాలుగా నిర్వచిస్తారు. త్రిపుర సుందరిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మూడు విధాలుగా ఆరాధనాదీక్షను ఆచరిస్తారు (1) దేవీ ధ్యానము (2) శ్రీచక్ర పూజ (3) శాక్త సిద్ధాంత అధ్యయనము. ఈ మూడింటినీ కలిపి శ్రీవిద్య అంటారు. [1] వీటిలో శ్రీచక్రపూజ చాలా ముఖ్యంగా భావిస్తారు. దీనినే మరొక విధంగా లలితా సహస్రనామ స్తోత్రము పారాయణము, శ్రీచక్రార్చన, షోడశాక్షరీ మంత్రము అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య" అని చెబుతారు. శ్రీవిద్యలో "వామాచారము", "సమయాచారము" అనె రెండు విధాలున్నాయి. సౌందర్య లహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది.

మిగిలిన అనేక శ్లోకాలలోఅనేక శ్రీవిద్యా రస్యాలున్నాయి అని చెబుతారు. ఉదాహరణకు "శివః శక్త్యా యుక్తో యది భవతి" అని ప్రాంభమయ్యే మొదటి శ్లోకంలోనే శ్రీవిద్యాసారమంతా నిక్షిప్తమయ్యి ఉన్నదని దర్శన సాహిత్య కర్తల అభిప్రాయము. కామేశ్వర సూరి ఈ శ్లోకాన్ని శ్రీవిద్యలోని 14 అంశాల పరంగా వ్యాఖ్యానించాడు. అవి (1) వేదాంతము (2) సాంఖ్యము (3) శ్రీవిద్య యొక్క ముఖ్య దేవత (4) సార్ధకములైన శబ్దములు (5) వాని అర్ధము (6) శబ్దముల సృష్టి (7) యంత్రము (8) ప్రణవము (9) మాతృక (సంస్కృతాక్షరమాల) (10) కాది విద్య (11) హాదివిద్య (!2) పంచాక్షరి (13) దీక్షనిచ్చు గురువు (14) చంద్రకళ [1]. ఒక్కొక్క శ్లోకంలోను ఒక్కొక్క మంత్రం లేదా బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయంటారు.
ఇంకా సౌందర్య లహరిలో అనేక మంత్రాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయంటారు. ఒక్కో మంత్రానికి లేదా శ్లోకానికి ఒకోపారాయణాఫలం చెప్పబడింది. శాక్తేయులలో రెండు శాఖలవారున్నారు - కౌలాచారులు, సమయాచారులు. కౌలులు శ్రీచక్రం, ఇతర సంకేతాలలో శ్రీమాతను పూజిస్తారు మరియు బాహ్యపూజకు ప్రాధాన్యత ఇస్తారు. సమయాచారులు అంతఃపూజ ద్వారా మూలాధార చక్రంనుండి సహస్రదళకమలం వరకు కుండలినీశక్తిని జాగృతం చేయడాని దీక్ష సాగిస్తారు.

సౌందర్యలహరిలోని శ్లోకాలు మంత్రాలుగా కూడా భావింపబడుతాయి. ఒక్కొక్క శ్లోకం నియమానుసారం ఉపాసిస్తే ఒక్కో ప్రయోజనం లేదా సిద్ధి లభిస్తుందని విశ్వాసం. ఉదాహరణకు -
మొదటి శ్లోకము - దినమునకు 100సార్లు చొప్పున 12 దినాలు జపించి త్రిమధురము (బెల్లము+నేయి+కొబ్బరి) లేదా మధురమైన అపూపము నైవేధ్యంగా పెడితే ఇష్ట సిద్ధి, అభ్యుదయము, సకల విఘ్ననివారణ కలుగుతాయి.
11వ శ్లోకము - దినమునకు 100సార్లు చొప్పున 8 దినాలు జపించి బెల్లపు పానకము, వెన్న, గారెలు మహానైవేద్యం పెట్ఠాలి. ఈ శ్లోకాన్ని రాగిరేకుపై వ్రాసి మొలతాడులో తాయెత్తుగా కట్టుకొనాలి. అప్పుడు వంధ్యత్వం నశిస్తుంది.
20వ శ్లోకం- విభూతిలో గాని, నీటిలో గాని వ్రాసి 1000 సార్లు జపిస్తే విషం విరుగిపోతుంది. దినమునకు 2000 సార్లు చొప్పున 45 దినములు జపిస్తే సర్పవశీకరణ లభిస్తుంది.
43వ శ్లోకం- దినమునకు 3000 సార్లు చొప్పున 40 దినములు జపించి తేనెను నైవేద్యంగా పెట్టి ఉంగరముగా తాయెత్తు ధరిస్తే అందరిని ఆకర్షించే శక్తి లభిస్తుంది.
91వ శ్లోకం- దినమునకు 1000 సార్లు చొప్పున 45 దినములు పాయసమును నైవేద్యంగా పెడితే భూమి, ధనము సిద్ధిస్తాయి.
103వ శ్లోకం- 45 దినాలలో మొత్తం లక్ష సార్లు జపించి, పండ్లు కొబ్బరికాయ నైవేద్యం సమర్పించాలి. సకల వాంఛాసిద్ధి యగును.