Sunday, 14 September 2014

LORE SRIKRISHNA PURANA POEMS


శ్రీ కృష్ణుని మరణము

ద్వారకా నగరం నుంచి దుఖంతో తిరిగి వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు శ్రీకృష్ణ ,బలరామాదుల క్షేమం అడుగుతూ సంధించిన ప్రశ్నల పరంపర లలో కొన్ని .. -దైన్యం చెందవలసిన సందర్భాలను అన్నిటిని ఓ పట్టిక తయారు చేసినట్టు గా పోతనగారు తెలియచేసారు .

ఓడితివో శత్రువులకు
నాడితివో సాదు దూషనాలాపములన్
గూడితివో పరసతులను
వీడితివో మానధనము వీరుల నడుమన్

తప్పితివో ఇచ్చెదనని
చెప్పితివో కపటసాక్షి ! చేసిన మేలుం
దెప్పితివో ! శరణార్థుల
రొప్పితివో ద్విజుల ,బసుల ,రోగుల సతులన్

అడిచితివో భూసురులను
గుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను ;
ముడిచితివో పరుల విత్తములు లోభమ్మునన్

అర్జునుని లోకోత్తరమైన సమాధానం

మన సారథి ,మన సచివుడు
మన వియ్యము , మన సఖుండు , మన బాంధవుడు న్
మన విభుడు ,గురుడు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా !