Search This Blog

Chodavaramnet Followers

Saturday 31 October 2015

CONVENT SEAT


THREE EYES HANUMAN TEMPLE - THRINETRA DASA BHUJA VEERANJANEYA SWAMY TEMPLE AT ANANDHA MANGALAM - NAGAPATNAM DISTRICT - TAMILNADU - INDIA


మూడు కన్నుల హనుమంతుని మున్నెన్నడైనా చూసారా
హనుమంతుడు … ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని తెలుసుకున్నారా ?
అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.
“స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల”ని వేడుకున్నాడు.
అప్పుడు రాముడు “నారదా ! రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ”ని అన్నాడు. , రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంఖు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ఇచ్చారు .. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.విశిష్ఠంగా కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.
వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

DEVIL LOVERS


RAINY SEASON


TELUGU MORAL STORIES COLLECTION - THIRINA BHAKI


RARE IMAGES OF INDIAN TEMPLES






THANKS TO SRI SRAJU NANDA GARU 

SRI MAHA GANAPATHI MANTRAM - LORD GANESH PRAYER IN TELUGU


CHOTA NAYAK


Friday 30 October 2015

HOSPITALS CARTOON


PRAJALERUNGAGA - VEMANA PADYALU COLLECTION


CHITTHA SUDDHI YOKKATI - VEMANA PADYAM


BHAKTHI YUNNA CHOTA PARAMESWARUDUNDU - VEMANA PADYAM AND ITS MEANING


TV REMOTE DARLING PLEASE


ONE PATTU SAREE FOR ME DEAR


POOR ADVOCATE


ATLATHADDHI FESTIVAL STORY AND PUJA ARTICLE IN TELUGU


పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.

రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.

ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.
అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.

LORD HANUMAN IN A DIFFERENT WAY


BHAGAWAN SRI RAMA'S TELUGU PRAYER


శ్రీరామ నామము రామ నామము రమ్యమైనది శ్రీరామ నామము 
రామ నామము రామ నామము రామ నామము రామ నామము
శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా|| 
దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా|| 
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామ నామము ||రా||
కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా||
పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా||
ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా||
నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా||
ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా||
అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీరామ నామము ||రా||
గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా||
గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా||
బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా||
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము ||రా||
భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామ నామము ||రా||

OM NAMO VIGNESWARAYA NAMAHA


BEAUTIFUL PRINCESS WITH A LOVELY PARROT PAINTING


TELUGU ARTICLE ABOUT THE GREAT WRITER MAHA KAVI KALIDASU


కవికుల గురువు – కాళిదాస మహా కవి !
(సరసభారతి ఉయ్యూరు)

కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు .ఐదవ శతాబ్ది వాడని అనుకుంటారు .అభిజ్ఞాన శాకుంతలం నాటకం తో విశ్వ వ్యాప్త కీర్తి నార్జించిన వాడు .ఉపమా కాళిదాసస్య అనే టాగ్ ఉన్న కవి .

కుమార సంభవ కావ్యం లో హిమాలయ సౌందర్యాన్ని అత్యద్భుతం గా కీర్తిన్చాడుకనుక హిమాలయ సానువులలో ఉండే వాడేమో నని కొందరి ఊహ .మేఘదూతం కావ్యం లో ఉజ్జయిని ని కమనీయం గ చెప్పాడుకనుక ఉజ్జయిన వాసుడని మరి కొందరి అభిప్రాయం .రఘు వంశ కావ్యం లో కలింగ రాజు హేమాన్గదుడి గురించి రాశాడు కనుక కలింగ వాసి అని ఇంకొందరి అనుమానం .లక్ష్మీధర కల్లా అనే పరిశోధకుడు వీరికి భిన్నం గా కాశ్మీరుకు చెందిన వాడని చెప్ప్పాడు .అధిక సంఖ్యాకుల మనోభావం ప్రకారం కాళిదాస మహాకవి ఉజ్జయిని ప్రాంతం వాడే .ఒక రాజ కుమారిని వివాహం చేసుకొని ,చదువేమి లేక పోవటం తో సవాలు గా కాళికా దేవిని ప్రసన్నం చేసుకొని నాలుక పై బీజాక్షరాలు రాయించుకొన్న అదృష్ట వంతుడు .దానితో ఆయన మహా కవిగా రూపు దాల్చాడనే కద అందరికి తెలిసిందే .శ్రీ లంక రాజు కుమార దాసును కలిశాడని అక్కడ జరిగిన కుట్రలో హత్య చేయబడ్డాడనే కధనమూ ఉంది .

కాని కాళిదాసుకాలం నాలుగవ శతాబ్దికి విక్రమాదిత్య మహా రాజు కాలం తో సరిపోతోందని కొందరు వాదిస్తే, కాదు అయిదవ శతాబ్దపు చంద్ర గుప్తుని సమకాలీనుడని మరి కొందరి వాదన .ఇదంతా శుద్ధ తప్పు క్రీ పూ.ఒకటవ శతాబ్దం లోని అప్పటిఉజ్జయిని పాలకుడు విక్రమాదిత్యుని కాలం వాడని అన్నారు మరింత వెనక్కి నెట్టేసి .,ఆధునికులు మాత్రం అయిదు ఆరు శతాబ్దికి చెందాడు అంటారు .634శిలాశాసనం ప్రకారం బారవి కాళిదాసు పేర్లు ఒకే చోట కనిపించాయి .ఈ శాసనం కర్నాటక లోని ఐహోల్ లో లభించింది .,కాళిదాస కాలం పై చర్చను వదిలేసి ఆ మహాకవి రచనా వైవిధ్యాన్ని సామర్ధ్యాన్ని గురించి తెలుసు కొందాం .

మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ,మాళవికాగ్ని మిత్రం ,విక్రమోర్వశీయం అనే మూడు నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధ నాటకం గా గుర్తింపు పొందింది .జర్మనీ ఫిలాసఫర్ కవి విమర్శకుడు నాటక కర్త శాకుంతలాన్ని చదివి యెగిరి గంతేసి నాట్యం చేశడని ‘’దివిని భువిని ఏకం చేశాడు కాకాళి దాసు ‘’అని సంభ్రమాశ్చర్యాలతో ఆనంద బాష్పాలు కార్చాడని చెబుతారు .అంతటి కీర్తి పొందింది .ఇందులో నాలుగో అంకం నాలుగో శ్లోకం అన్నిటికంటే గొప్పది అనే పేరుంది కాన్వ మహర్షి పెంచిన కూతురు శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు కాలి దాసు ఆయనతో అనిపించినా శ్లోకే ఇది పెంచిన తండ్రి తానె దుఖాన్ని ఆపుకోలేక పోతుంటే కానీ పెంచి పెళ్లి చేసి అత్త వారింటికి కూతుర్నిపంపించే తల్లిదండ్రుల మనోక్షోభ ఎంతటిదో అనే భావం ఇందులో ఉంది .వీరేశలింగం గారు ఈ నాటాకాన్ని తెలుగులో గొప్పగా అనువదించారు .మాళవికాగ్ని మిత్రం అంటే ఆ ఇద్దరి కదా .మాళవిక అనే ఒక దాసీ పై ప్రేమలో పడిన రాజు అగ్ని మిత్రుడి కద .రాణి గారికి వీరి ప్రేమాయణం తెలిసి దాసిని నిర్బందిస్తుంది .మాళవిక రాజ పుత్రికయే నని తెలుస్తుంది .రెండవది అభిజ్ఞాన శాకుంతలం .దీని కద అందరికి తెలిసిందే .మూడవది విక్రామోర్వశీయం –పురూరవ రాజు దేవతా స్త్రీ ఊర్వశి ల ప్రణయం ఇతి వృత్తం .వీరి ప్రేమ అనేక ఆటంకాలకు లోననై చివరికి ఇద్దరూ ఏకమై ఊర్వశి విజయ విక్రమ అవుతుంది .

కాళిదాస మహా కవి మహా కావ్యాలు కుమార సంభవం ,రఘువంశం .పార్వతి దేవిజననం శివునితో కల్యాణం తాటక సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భావం కద కుమారా సంభవం .రఘు వంశ రాజుల చరిత్రను తెలిపేది రఘువంశం .ఈ రెండు కావ్యాలలో కాళిదాస ప్రతిభ బహుముఖీనం గా విస్తరించింది . గీర్వాణం అంటే దైవ స్వభావాన్ని పొందింది .వీటితో బాటు ఋతు ఘోష ,మేఘ దూతం అనే రెండు ఖండ కావ్యాలు రాశాడు కాళిదాసు భారత దేశ ఋతు వర్ణనను ప్రతిభా వంతం గా గా ఋతు ఘోషలో వర్ణించాడు .మేఘ దూతం లో మేఘాన్ని రాయ బారిగా ఒక యక్షుడు తన ప్రియురాలికి పంపిన సందేశాన్ని కవితాత్మకం గా దారిలో కనిపించే ప్రదేశాల వివరాలతో సహా రాశాడు .

కాళిదాసు కవితా ప్రతిభ

శృంగార రసాన్ని పిండి వడ బోశాడు కాళిదాసు .ఆయన దృష్టిలో ప్రపంచం రాగమయం గా దర్శన మిస్తుంది .వైదర్భీశైలి తో నాటకాలు రాశాడు .సులభ శైలిలోనే రాశాడు .ఆయన సూక్తులు రసమాదుర్యం తో తోణికిస లాడతాయి .శకుంతల సొందర్యమే కాళిదాసు కవితా సౌందర్యం ‘’అనాఘ్రాతమ్ పుష్పం కి.సలయ మలూనం కరరుహై –రానావిధం రత్నం మధునవ మనాస్వాదిత రసం –అఖండం పుణ్యానాం ఫల మివచ తద్రూప మనఘం ‘’.కవుల్లో అగ్రేసరుడు కాళిదాసు .దీన్ని ఒక కవి తమాషాగా చెప్పాడు ‘’కవులు ఎవరెవరు అని లెక్కించటానికి చిటికెన వేలుతో ప్రారంభిస్తే మొదటి వాడు కాళిదాసు రెండవ వాడు తగలనే లేదట అదీ ఆయన గొప్పతనం అంటాడు ..శాస్త్ర సంబంధ ఉపమానంకాలారాలు విరివిగా వాడాడు .

‘’తతో మందానిలోద్ధత కమలాకర శోభినా –గురుం నేత్ర సహ్శ్రేనా నోదయామాస వాసవః ‘’ఇంద్రుడు తనకున్న వెయ్యి కళ్ళతో గురువు బృహస్పతిని చూశాడట .ఆ కదలిక మెల్లని చల్లని గాలి చేత కమల వనం కదిలి నట్లు గా ఉందట. .మరో ఉపమాలంకారం –ఇందుమతీ స్వయం వరం లో రాజులు వరుసలో కూర్చున్నారు .ఆమె ఒక్కొక్కరిని చూస్తూ తిరస్కరిస్తూ వెడుతుంటే ప్రతివారికి తననే వరిస్తుందనే ఆశ తో ముఖం వెలిగింది .దాటిపోగానే ముఖాలు చిన్న బోయాయి .దీన్ని దీప శిఖ తో పోల్చాడు దీపం ముందుకు వెడుతుంటే వెనకాల చీకటిని వదిలి పెట్టటం సహజం కదా అలా ఉంది ఈ సీను .దీప శిఖా వర్ణన కాళిదాసు చాలా చోట్ల చేశాడు .దేని ప్రత్యేకత దానికి ఉంది .

ఉత్ప్రేక్ష లను ,అర్ధాంతర న్యాసాలను అర్ధవ వంతం గా వాడాడు .వాల్మీకి తర్వాత ప్రక్రుతి వర్ణనలకు కకాళిదాసుకే పేరు .ప్రకృతిని కవిత్వం లో చిత్రం గీసి చూపిస్తాడు .స్త్రీలను కోమలం గా వర్ణించాడు .వారికి ప్రత్యెక వ్యక్తిత్వం ఉంటుంది .సంవాదాలు నాటకీయం గా నడిపిస్తాడు .ఋతు సంహారం లో ఒక్కో సర్గలో ఒక్కో రుతువును వర్ణించాడు .మల్లినాద సూరి కాళిదాస కావ్యాలకు గొప్పగా టీకా తాత్పర్యాలు సంస్కృతం లో రాస్తే వేదం వెంకటరాయ శాస్త్రిగారు చక్కని తెలుగులో చెప్పారు .కాళిదాస రచనలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదం పొందాయి .కొందరు ఆంగ్ల కవి నాటక రచయితా షేక్స్ పియర్ తో కాళిదాసును పోలుస్తారుకాని కాళిదాసు ప్రతిభ ముందు ఆయన సరిపోలడని ఎక్కువ మంది అభిప్రాయం 

BEAUTIFUL BRIDAL BLOUSES DESIGNS COLLECTION




SAMBAR AND PICKLE


TAMIL ACTRESS - HOT SHOW OF MADHURIMA




RAT - CHAT - HUNGAMA


BEAUTIFUL OIL PAINTING OF AN INDIAN DANCER


Wednesday 28 October 2015

TELUGU MOVIE BHALE AMMAILU 1957 MOVIE SONG LYRIC


భలే అమ్మాయిలు
రచన : --సదాశివబ్రహ్మం
గానం : ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల
...
గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా దరిజేర చలమేలరా...ఆ...
దరిజేర చలమేలరా ||2||
నన్ను దయజూడ విధియేమిరా ||దరి||
మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర ||గోపాల||
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళి
అనుపమ సంగీత మొలికించు సరళి ||కనుగొన||
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా ||కనుగొని||
కనికరించి పలుకరించవేలరా
మురళీధర కరుణాకర గిరిధర ||గోపాల||
సరిగపద ||గోపాల||
సదపగరి సరిగపద ||గోపాల||
పగరిసదా సరిగపద ||గోపాల||
దాసరి పాదస పా సరిగపద ||గోపాల||
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద ||గోపాల||
సాస దదసాస గపదసాస రిగపదసాస సరిగపద ||గోపాల||
రీగ రిగ రీరీ... ఆ...
రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని ||గోపాల||
నిస్సనినిసా...ఆ...
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని ||గోపాల||
గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా... ఆ...
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ...ఈ...
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ ||గోపాల||
మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద ||జాగేలరా||
రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ...ఆ...రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని ||గోపాల||
గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా... గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ...
రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా...రిరిసారిరిదా సదవ గపదా...
గరిసదగరీ...సదపగసదా...సదసపదగా...గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద||గోపాల జాగేలరా|

THANKS TO SRI Vinjamuri Venkata Apparao GARU 
FOR PROVIDING THIS SONG LYRIC