Search This Blog
Chodavaramnet Followers
Wednesday 31 December 2014
ARTICLE ON THE ADVANTAGES OF A VEGETARIAN IN TELUGU
శాకాహారమే ఎందుకు తినాలి.. ?
కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.
శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో....!
డీటాక్సిఫై : వెజిటబుల్ డైట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్వెజ్లో ఫైబర్ లభించదు.
ధృడమైన ఎముకలు :
మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.
కార్బోహైడ్రేట్స్ లోపం :
నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్వెజ్లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఆరోగ్యకరమైన చర్మం:
బీట్రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.
బరువు నియంత్రణ :
కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్వెజ్కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్వెజ్కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.
ఫైటో న్యూట్రియెంట్స్ :
డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఇవి వెజిటేరియన్ డైట్లో మాత్రమే లభిస్తాయి. నాన్వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది.
సులభంగా నమలడం :
మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.
ARTICLE ON HOW TO PERFORM PUJA ON VYKUNTA EKADASI IN TELUGU
వైకుంఠ ఏకాదశి నాడు ఎలా పూజ చేయాలంటే..!?
వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
అందుచేత వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.
విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.
ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ARTICLE ON VYKUNTA EKADASI UPAVASAMU IN TELUGU
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసముంటే..?
వైకుంఠ ఏకాదశీ వ్రతం" ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.
ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైనపుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు.
ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది
JESUS - NEW YEARS PRAYER
New Year's Prayer
Lord, this year I want to change,
and I've said that in the past.
but now my prayer is different
'cause I understand at last.
I wanted my own way before,
I ignored your loving plans.
But now I'm putting everything
into your nail-scarred hands.
I promise to obey you
out of gratitude and love.
I won't be giving orders
to my Father up above.
I finally realize the truth
and so I've changed my prayer.
The safest place for me to be
is in your gentle care.
Please be my shepherd, Jesus,
that's all I ask of you.
In good times and in bad this year,
Take my hand and lead me through.
Amen.
Lord, this year I want to change,
and I've said that in the past.
but now my prayer is different
'cause I understand at last.
I wanted my own way before,
I ignored your loving plans.
But now I'm putting everything
into your nail-scarred hands.
I promise to obey you
out of gratitude and love.
I won't be giving orders
to my Father up above.
I finally realize the truth
and so I've changed my prayer.
The safest place for me to be
is in your gentle care.
Please be my shepherd, Jesus,
that's all I ask of you.
In good times and in bad this year,
Take my hand and lead me through.
Amen.
Monday 29 December 2014
EVENING SPECIAL EGG PANNEER KURMA RECIPE IN TELUGU
పన్నీర్ ఎగ్ కుర్మా::
కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4(ఉడికించి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ : 1
టమోటో గుజ్జు: 1/2
వెల్లుల్లి రెబ్బలు: 3-4
అల్లం: కొద్దిగా
పచ్చిమిర్చి: 2
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tbsp
పసుపు : కొద్దిగా
ధనియాల పొడి: 1/2tsp
గరం మసాల: 1tsp
వెజిటేబుల్ ఆయిల్ లేదా నెయ్యి 2-3tbsp
పచ్చిబఠానీలు: 1cup లేదా పన్నీర్: 250grms
తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్డును ఉడకబెట్టి, పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
4. ఇప్పుడు అందులోనే మసాలాలు(ఉప్పు, పసుపు, కొత్తిమీర మరియు కారం)గరం మసాలా తప్ప మిగిలిన మసాలాలన్నింటిని వేసి ఒక నిముషం వేగించుకోవాలి. నూనె తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, నీరు ఇమిరిపోయే వరకూ ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న పన్నీర్ తురుము లేదా పచ్చిబఠానీలను వేసి బాగా మిక్స్ చేయాలి.
7. కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులోనే ఒక కప్పు నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. దింపుకోవడానికి ముందు 10నిముషాలు సిమ్ లో ఉంచాలి . చివరగా గరం మసాలా మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి పరోటా, రోటి లేదా రైస్ తో సర్వ్ చేయాలి. అంతే పనీర్ ఎగ్ కుర్మా రెడీ.
కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4(ఉడికించి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ : 1
టమోటో గుజ్జు: 1/2
వెల్లుల్లి రెబ్బలు: 3-4
అల్లం: కొద్దిగా
పచ్చిమిర్చి: 2
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tbsp
పసుపు : కొద్దిగా
ధనియాల పొడి: 1/2tsp
గరం మసాల: 1tsp
వెజిటేబుల్ ఆయిల్ లేదా నెయ్యి 2-3tbsp
పచ్చిబఠానీలు: 1cup లేదా పన్నీర్: 250grms
తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్డును ఉడకబెట్టి, పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
4. ఇప్పుడు అందులోనే మసాలాలు(ఉప్పు, పసుపు, కొత్తిమీర మరియు కారం)గరం మసాలా తప్ప మిగిలిన మసాలాలన్నింటిని వేసి ఒక నిముషం వేగించుకోవాలి. నూనె తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, నీరు ఇమిరిపోయే వరకూ ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న పన్నీర్ తురుము లేదా పచ్చిబఠానీలను వేసి బాగా మిక్స్ చేయాలి.
7. కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులోనే ఒక కప్పు నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. దింపుకోవడానికి ముందు 10నిముషాలు సిమ్ లో ఉంచాలి . చివరగా గరం మసాలా మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి పరోటా, రోటి లేదా రైస్ తో సర్వ్ చేయాలి. అంతే పనీర్ ఎగ్ కుర్మా రెడీ.
PUNJABI SPECIAL SWEET PAROTA RECIPE IN TELUGU
స్వీట్ పరోఠా రిసిపి: పంజాబి స్పెషల్
కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
నెయ్యి: 3-4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఫిల్లింగ్ కోసం:
పంచదార: 1cup
బాదం: 5
దాల్చిన చెక్క పొడి: 1/2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సర్ గ్రైండర్ లో పంచదార వేసి మొత్తగా పొడి చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తూ ముద్దగా కలిపి పెట్టుకోవాలి.
3. అంతలోపు, పంచదార, బాదం, మరియు దాల్చిన చెక్క పొడిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత పిండిని కొద్దిగా చేతిలోనికి తీసుకొని గుండ్రంగా చేసి, తర్వాత చపాతీ కర్రతో రోల్ చేయాలి. మద్యలో ఫిల్లింగ్ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థంను మద్యలో పెట్టి నాలుగు వైపులా కవర్ చేసి తిరిగి చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద తవా పెట్టి వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసి స్వీట్ పరోటాలను వేసి రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ పరోటాలను వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.
కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
నెయ్యి: 3-4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఫిల్లింగ్ కోసం:
పంచదార: 1cup
బాదం: 5
దాల్చిన చెక్క పొడి: 1/2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సర్ గ్రైండర్ లో పంచదార వేసి మొత్తగా పొడి చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తూ ముద్దగా కలిపి పెట్టుకోవాలి.
3. అంతలోపు, పంచదార, బాదం, మరియు దాల్చిన చెక్క పొడిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత పిండిని కొద్దిగా చేతిలోనికి తీసుకొని గుండ్రంగా చేసి, తర్వాత చపాతీ కర్రతో రోల్ చేయాలి. మద్యలో ఫిల్లింగ్ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థంను మద్యలో పెట్టి నాలుగు వైపులా కవర్ చేసి తిరిగి చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద తవా పెట్టి వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసి స్వీట్ పరోటాలను వేసి రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ పరోటాలను వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.
Friday 26 December 2014
WINTER CARE HEALTH FOOD TIPS
శీతాకాలం చురుకైన ఆహారం
చురుకులేని వాతావరణంలో ఎంత ప్రయత్నించినా ఉత్సాహం కలగదు. మనసూ, శరీరం కూడా మందకొడిగానే ఉంటాయి. దీన్నే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్' అంటారు. ఈ సమస్య తగ్గాలంటే ఆహారంపై దృష్టి పెట్టాలి.
'డి' విటమిన్తో ఈ సమస్య చాలావరకూ తగ్గుముఖం పడుతుంది. ఈ కాలంలో ఎండ నుంచి తగినంత 'డి' విటమిన్ లభించదు. అందుకే చేపల నుంచి పొందే ప్రయత్నం చేయాలి. చేపలు తినడం వల్ల మెదడు నుంచి సెరటోనిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనసుని హుషారుగా ఉంచుతుంది. ఈ కాలంలో గుడ్లని ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సహజమైన ఉత్సాహ కారకాలుగా పనిచేస్తాయి. కోడిగుడ్లలోని ఫాస్పోలిపిడ్స్ మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
ఎక్కడ చూసినా కమలాలు కనువిందుగా కనిపిస్తున్నాయి కదా! ఆలస్యం ఎందుకు తినేయండి.
కమలాల్లో విటమిన్ 'సి' మాత్రమే కాదు... మెదడుని ఉత్తేజితం చేసే ఫొలేట్లు దానిలో ఎక్కువగా ఉంటాయి. బాదం గింజలూ, వాల్నట్లూ, వేరుసెనగా, జీడిపప్పూ కొద్దిగా తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాటిల్లోని సెలీనియమ్ నిరాశను తగ్గించి, మానసికోత్సాహం కలిగేలా చూస్తుంది.
చురుకులేని వాతావరణంలో ఎంత ప్రయత్నించినా ఉత్సాహం కలగదు. మనసూ, శరీరం కూడా మందకొడిగానే ఉంటాయి. దీన్నే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్' అంటారు. ఈ సమస్య తగ్గాలంటే ఆహారంపై దృష్టి పెట్టాలి.
'డి' విటమిన్తో ఈ సమస్య చాలావరకూ తగ్గుముఖం పడుతుంది. ఈ కాలంలో ఎండ నుంచి తగినంత 'డి' విటమిన్ లభించదు. అందుకే చేపల నుంచి పొందే ప్రయత్నం చేయాలి. చేపలు తినడం వల్ల మెదడు నుంచి సెరటోనిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనసుని హుషారుగా ఉంచుతుంది. ఈ కాలంలో గుడ్లని ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సహజమైన ఉత్సాహ కారకాలుగా పనిచేస్తాయి. కోడిగుడ్లలోని ఫాస్పోలిపిడ్స్ మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
ఎక్కడ చూసినా కమలాలు కనువిందుగా కనిపిస్తున్నాయి కదా! ఆలస్యం ఎందుకు తినేయండి.
కమలాల్లో విటమిన్ 'సి' మాత్రమే కాదు... మెదడుని ఉత్తేజితం చేసే ఫొలేట్లు దానిలో ఎక్కువగా ఉంటాయి. బాదం గింజలూ, వాల్నట్లూ, వేరుసెనగా, జీడిపప్పూ కొద్దిగా తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాటిల్లోని సెలీనియమ్ నిరాశను తగ్గించి, మానసికోత్సాహం కలిగేలా చూస్తుంది.
Subscribe to:
Posts (Atom)